కేజీహెచ్లో..రోగుల అవస్థలు
కేజీహెచ్లో ఆదివారం మధ్యాహ్నం గంట పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రసూతి వార్డులో శిశువులు, బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడారు.
జనరల్ వార్డులో విసనకర్రతో విసురుకుంటున్న మహిళ, వెనుకనున్న మంచాల వద్ద ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్యాన్లు
ఈనాడు, విశాఖపట్నం: కేజీహెచ్లో ఆదివారం మధ్యాహ్నం గంట పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రసూతి వార్డులో శిశువులు, బాలింతలు భరించలేని ఉక్కపోతతో అల్లాడారు. జనరేటర్ ఉన్నా వినియోగించక పోవడంతో విసనకర్రలే రోగులకు దిక్కయ్యాయి. గదుల్లో పట్టపగలే చీకట్లు అలముకున్నాయి. ప్రసూతి వార్డులో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో చాలా మంది ఇంటి నుంచే టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకున్నారు. వార్డుల్లో చివరిన ఉండే బెడ్ల వద్ద ఫ్యాన్లు లేవు. ఉన్నవి కూడా సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.
గుండెజబ్బుల విభాగం వద్ద నీరురాని కుళాయిలు
అధ్వానంగా శౌచాలయాలు: కేజీహెచ్లోని ప్రసూతి జనరల్ వార్డుల్లో శౌచాలయాలు అధ్వానంగా ఉన్నాయి. బాలింతలు, గర్భిణులు మరుగుదొడ్లు వినియోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దుర్గంధం వెదజల్లుతోందని, పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో జారిపడే ప్రమాదం ఉందని రోగుల కుటుంబీకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి జనరల్ వార్డుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలని కోరుతున్నారు.
పనిచేయని తాగునీటి కుళాయిలు: ఆసుపత్రి ఆవరణలోని పలు విభాగాల వద్ద కుళాయిలు పని చేయట్లేదు. గుండెజబ్బుల విభాగం బయట ఉన్న నీటి కుళాయి నుంచి నీరు రావట్లేదు. దీంతో రోగులను కలిసేందుకు వచ్చేవారు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఆసుపత్రి బయటకు వెళ్లి నీళ్ల సీసాలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ