రహదారిలో దర్జాగా నిర్మాణాలు
‘మీరు కట్టుకోండి.. మేం కళ్లు మూసుకుంటాం’ అన్న తీరున వ్యవహరిస్తున్నారు పట్టణ ప్రణాళికాధికారులు. ఓ వైపు వైకాపా కార్పొరేటర్ల సిఫార్సులు, మరోవైపు లంచాల మత్తు వెరసి జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
కాసులు తీసుకుని పట్టించుకోని ప్రణాళికాధికారులు
ఫిర్యాదులొస్తే నోటీసులిచ్చి హడావుడి
తిరిగి మళ్లీ నిర్మించుకోండంటూ ఉచిత సలహాలు
వైకాపా కార్పొరేటర్ల అండతో భారీగా అక్రమ కట్టడాలు
మాస్టర్ప్లాన్ రహదారిలో చేపట్టిన భారీ భవనం
‘మీరు కట్టుకోండి.. మేం కళ్లు మూసుకుంటాం’ అన్న తీరున వ్యవహరిస్తున్నారు పట్టణ ప్రణాళికాధికారులు. ఓ వైపు వైకాపా కార్పొరేటర్ల సిఫార్సులు, మరోవైపు లంచాల మత్తు వెరసి జీవీఎంసీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనధికార నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు కంటితుడుపుగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. తిరిగి మళ్లీ నిర్మించుకోండంటూ అక్రమార్కులకే అధికారులు ఉచిత సలహాలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రణాళికాధికారులు భారీగా వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్-న్యూస్టుడే
నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పని నిలిపివేయాలని నోటీసులు జారీ చేస్తూనే, మరో పక్క నిర్మాణం చేసుకోండని నిర్మాణదారులకు ప్రణాళికాధికారులు చెప్పినట్లు ఆరోపణలున్నాయి. రహదారి స్థలాన్ని ఆక్రమించినా, చర్యలు తీసుకోకుండా ఉండేలా సహాయ ప్రణాళికాధికారి భారీగానే ముడుపులు తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణానికి ఆనుకుని, మరో భారీ నిర్మాణానికి పునాదులు పూర్తి చేసి, పిల్లర్లు వేసే పనులు చేపడుతున్నారు. దాన్ని నిలుపుదల చేయాల్సిన ప్రణాళికాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణాలు పూర్తయితే, భవిష్యత్తులో రహదారి విస్తరణ జరగదు. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.
పనులు నిలిపిన భవనం పక్కనే మరో భవన నిర్మాణ పనులు
హవ్వ.. విస్తరణ రహదారిపై నిర్మాణాలా?
నగరంలోని జోన్-2 పరిధిలోని ఏడవ వార్డు జాతీయ రహదారికి ఆనుకుని దుర్గానగర్ రహదారిలో చేపడుతున్న భారీ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది. ప్రస్తుతం 30 అడుగుల రహదారిగా ఉన్నప్పటికీ, త్వరలో దానిని 40 అడుగుల రహదారిగా విస్తరించడానికి రహదారి అభివృద్ధి ప్రణాళిక సైతం సిద్ధమైంది. నిర్మాణదారు 40 అడుగుల రహదారిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా పూర్తిగా రహదారి స్థలాన్ని ఆక్రమించేస్తున్నారు. నాలుగు అంతస్తుల్ని నిర్మాణదారు ఇప్పటి వరకు పూర్తి చేసినా, ప్రణాళికాధికారులు గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
జ్యోతినగర్లో సెల్లార్ మూసేస్తూ అక్రమ నిర్మాణం
పట్టణ ప్రణాళికలో వసూల్ రాజాలు!
జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో సహాయ ప్రణాళికాధికారులుగా విధులు నిర్వహిస్తున్నవారు నిర్మాణదారులతో కుమ్మక్కవుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది సహాయ ప్రణాళికాధికారులు నేరుగా బేరాలు కుదుర్చుకుంటుండగా, మరికొంత మంది దిగువ స్థాయి సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. జోన్-2 పరిధిలోని ఓ అధికారి మున్సిపల్ శాఖ మంత్రికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకున్నారు. ఇంకేముంది? ఆయనపై ఆరోపణలొచ్చినా, ఉన్నతాధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జోన్-3లో అనేక అక్రమాలు జరుగుతుండగా, పాలకవర్గం సభ్యులను దన్నుగా చేసుకుని, ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. జోన్-4, జోన్-5లలో సహాయ ప్రణాళికాధికారి చేయాల్సిన పనులను ఆ తరువాత స్థానంలో ఉన్న అధికారులే చేస్తుండటం, వారే నేరుగా భవన నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి అప్పగిస్తున్నట్లు విమర్శలున్నాయి. పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చినా, కనీసం స్పందించకపోవడానికి ఏసీపీల వెనుక అధికారులుండటమే అన్న వాదన వినిపిస్తుంది.
తెలిసినా తెలియనట్లే..
జోన్-4లో 29వ వార్డులో అదనంగా రెండు అంతస్తులు వేసిన నిర్మాణం వైపు కన్నెత్తి చూడకపోవడం, కనీసం నోటీసులు కూడా జారీ చేయకపోవడం వెనుక సహాయ ప్రణాళికాధికారికి భారీగా నగదు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. జోన్-5 పరిధిలో 54వ వార్డు జ్యోతినగర్లో సెటబ్యాక్లు విడిచిపెట్టకుండా, నిర్మాణ స్థలానికి సరైన పత్రాల్లేకుండా ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేశారు. దీనిపై సహాయ ప్రణాళికాధికారిని వివరణ కోరగా, పరిశీలిస్తామని పేర్కొనడం విశేషం. విచిత్రమేంటంటే ప్లానులో సెల్లారు చూపిన నిర్మాణదారు, ప్రస్తుతం దానిని మూసేసినా ప్రణాళికాధికారులు పట్టించుకోవడం లేదు. దీని వెనుక అధికార పార్గీ కార్పొరేటర్తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల