మద్యం విక్రయం.. నగదు రహితం
మద్యం విక్రయాల్లో ‘నవ్విపోదురు గాక నాకేంటి?’ అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఫోన్-పే, గూగుల్-పేలతో వెళితే మద్యం అమ్మేవారు కాదు.
డిజిటల్ పేమెంట్ల దిశగా అడుగులు
కూలీలు, పేదలకు తప్పని భారం
ఐదేళ్లుగా ఏమాయ చేశారో..
ఈనాడు - విశాఖపట్నం
మద్యం విక్రయాల్లో ‘నవ్విపోదురు గాక నాకేంటి?’ అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఫోన్-పే, గూగుల్-పేలతో వెళితే మద్యం అమ్మేవారు కాదు. నగదు రూపంలో చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. డిజిటల్ పేమెంట్లు జరపకుండా నగదును పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించినా చీమ కుట్టినట్లైనా స్పందించలేదు. ఇప్పుడేమో పాలసీ ఒక్కసారిగా మారిపోయింది. వైన్ షాపుల్లో ‘నో క్యాష్’ అంటున్నారు. డిజిటల్ పేమెంట్లు చేస్తేనే మద్యం ఇస్తామంటూ ఉద్యోగులు, సిబ్బంది చెబుతున్నారు. అకస్మాత్తుగా వచ్చిన మార్పులతో కూలీలు, పేదలు ఖంగుతింటున్నారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లోని బార్లకు మేలు చేసేలా ఉంది తప్పితే, ప్రభుత్వ ఆదాయం పెంచేలా లేదన్న విమర్శలున్నాయి.
అంతా మా ఇష్టం...: విశాఖ పార్లమెంట్ పరిధిలో (ఎస్.కోట మినహా) 139 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల్లో నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియగానే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 70శాతం డిజిటల్ పేమెంట్లు ఉండాలంటూ షాపులకు తొలుత మౌఖిక ఆదేశాలొచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రతి షాపులో 200-400 వరకు డిజిటల్ పేమెంట్లు ఉండాలని ఒత్తిడి పెంచారు. క్యాష్ పేమెంట్లు తీసుకోవద్దని తేల్చి చెప్పేశారు. దీంతో మద్యం షాపుల్లో ఉద్యోగులు 200 డిజిటల్ పేమెంట్ల లక్ష్యం పూర్తి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారిగా మారిన పాలసీతో ఫోన్-పేలు ఉపయోగించని పేద, వృద్ధులు మద్యం దుకాణాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా రూ.150-190 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో చీప్ లిక్కర్ 80శాతం వాటా విక్రయాలుంటాయి. చీప్ లిక్కర్ కొనుగోలు చేసే కార్మికులు, మత్స్యకారులు, పేదలకు యూపీఐ సేవలు చాలావరకు లేవు.
ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఇప్పుడు నగదు రహిత సేవలంటూ ఇలాంటి వారందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. క్రమంగా అలవాటు చేయాల్సి ఉన్నా కొత్త ప్రభుత్వం కొలువు దీరే సమయంలో ఇలా చేయడంపై మద్యం ప్రియులు మండి పడుతున్నారు. చేసేది లేక పక్కవారిపై ఆధారపడటంతో... ఫోన్పే, ఇతర మార్గాల్లో చెల్లింపులు చేసినందుకు రూ.10 కమీషనుగా గుంజుతున్నారు.
ఇన్నాళ్లూ పారదర్శకతకు పాతరేసినట్లేనా?
దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ వైకాపా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పింది. మద్యం తయారీ, విక్రయాలు గుప్పిట్లో పెట్టుకుని అంతా తామై ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. మద్యం సరఫరా నుంచి విక్రయాల వరకు భారీ అక్రమాలే జరిగాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డబ్బులు తీసుకున్నారు. ఈ సమయంలో క్రయవిక్రయాల్లో ఇష్టానుసారం వ్యవహరించారు. ఓ వైపు మద్యం దోపిడీ చేస్తున్నారంటూ, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల బార్లకు మేలు చేసేందుకు, సమీపంలోని ప్రభుత్వ దుకాణాల్లో బ్రాండ్లు పెట్టకుండా, దుకాణాలు వెంటనే మూసివేస్తూ సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అంటే ఇప్పుడు సాధ్యమైన నగదు రహిత లావాదేవీలు, వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎందుకు సాధ్యం కాలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో దుకాణాల నుంచి డబ్బులను సీఎఫ్ఎంఎస్కు చలానా తీసేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ల ద్వారా ఈ నగదు ఖజానాలో జమ అవుతుందా? లేక ఇంకెక్కడికైనా వెళుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు