పల్లెలకు పాకిన విష సంస్కృతి
బ్లేడ్ బ్యాచ్ సంస్కృతి పల్లెలకు విస్తరించింది. యువతిని వేధించొద్దని వారించిన వ్యక్తిపై గంజాయి మత్తులో ఉన్న ఒకరు బ్లేడ్తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన దిబ్బపాలెం సెజ్ కాలనీ సమీపంలో సోమవారం జరిగింది.
గంజాయి మత్తులో బ్లేడ్తో దాడి
గాయపడిన రాంబాబు
రాంబిల్లి, అచ్యుతాపురం, న్యూస్టుడే: బ్లేడ్ బ్యాచ్ సంస్కృతి పల్లెలకు విస్తరించింది. యువతిని వేధించొద్దని వారించిన వ్యక్తిపై గంజాయి మత్తులో ఉన్న ఒకరు బ్లేడ్తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన దిబ్బపాలెం సెజ్ కాలనీ సమీపంలో సోమవారం జరిగింది. రాంబిల్లి సీఐ లక్ష్మణరావు కథనం ప్రకారం.. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన లాలం శ్రీను గంజాయి మత్తులో రోడ్డుపై వెళ్తున్న యువతిని వేధించాడు. ఇది చూసిన ఇదే కాలనీకి చెందిన రెడ్డి రాంబాబు వారించే ప్రయత్నం చేశాడు. మత్తులో ఉన్న శ్రీను తన వద్ద ఉన్న బ్లేడ్తో రాంబాబుని తీవ్రంగా గాయపరిచాడు. రాంబాబు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వదలకుండా మెడ, చేతులు, ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. రాంబాబు కేకలు వేయడంతో స్థానికులు స్పందించి శ్రీను నుంచి ఇతనిని రక్షించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన లాలం శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూలేని ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
నిందితుడు శ్రీను
పోలీసులే బాధ్యత వహించాలి.... దిబ్బపాలెంసెజ్ కాలనీకి గంజాయి విక్రయాలకే కేంద్రంగా మారిపోయిందని కాలనీ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బైలపూడి రాందాసు ఆందోళన వ్యక్తంచేశారు. రాంబాబుపై దాడిచేసిన లాలం శ్రీను గంజాయి మత్తులో ఈదాడికి పాల్పడ్డాడన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు గంజాయి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి మత్తులో ఆరుబయట నిద్రించే మహిళల మెడలో బంగారు వస్తువులను లాక్కొని పోతున్నారని రాందాసు ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి పోలీసుల ఉదాసీనతే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు. గంజాయి మూలాలను తెలుసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. శ్రీనుకు గంజాయి ఎక్కడ నుంచి వచ్చిందో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం