‘జీ20’ అతిథులు మెచ్చేలా..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జీ20 సన్నాహక సదస్సుల్లో పాల్గొనేందుకు స్వదేశీ, విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. కొందరు ఆదివారం విశాఖ చేరుకున్నారు.
వన్టౌన్, న్యూస్టుడే
బీచ్రోడ్డులో ఏర్పాటు చేసిన సౌర వృక్షం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జీ20 సన్నాహక సదస్సుల్లో పాల్గొనేందుకు స్వదేశీ, విదేశీ ప్రతినిధుల రాక మొదలైంది. కొందరు ఆదివారం విశాఖ చేరుకున్నారు. సోమవారం 40 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారు 28వ తేదీ ఉదయానికి చేరుకోనున్నారు. సదస్సుల్లో పాల్గొనే దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో వారు అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి స్వస్థలాలకు వెళ్లే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. సదస్సుల నిర్వహణకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున 18 కమిటీలు ఏర్పాటు చేశారు.
* అతిథులు, ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొలువుదీరే వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. నగర సుందరీకరణ పనుల బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ రాజాబాబుకు అప్పగించారు. వేదిక వద్ద ఏర్పాట్లను రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సిద్ధంగా 300 వాహనాలు
* 98 మంది లైజాన్ అధికారులు విదేశీ అతిథులకు అవసరమైన సేవలందిస్తారు. ప్రొటోకాల్ బాధ్యతలను డీఆర్వో, ఆర్డీఓ, డీటీసీలకు అప్పగించారు. దాదాపు 300 వాహనాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29 లేదా 30న అతిథులు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయా ప్రదేశాల వద్ద యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది.
* రాష్ట్ర గవర్నర్ నజీర్ ఈనెల 28వ తేదీ సాయంత్రం విశాఖ చేరుకొని రాత్రికి గవర్నర్ బంగ్లాలో బస చేయనున్నారు. 29న తిరుగు ప్రయాణం కానున్నారు. కేంద్ర మంత్రుల పర్యటనల పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరికొందరు రాష్ట్రమంత్రులు ఈనెల 28 నాటికి విశాఖ చేరుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు వస్తున్నారు.
28న సీఎం జగన్ రాక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 28వ తేదీ సాయంత్రం 5.15గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్కు వెళతారు. అక్కడ జీ20 అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గలా డిన్నర్లో పాల్గొంటారు. రాష్ట్రంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై సీఎం ప్రసంగిస్తారు. రాత్రి 8గంటలకు రాడిసన్ బ్లూ హోటల్ నుంచి బయలుదేరి 8.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)