అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (14).
రోలుగుంట కేజీబీవీలో డీఈఓ విచారణ
తుర్రే చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (పాత చిత్రం)
నర్సీపట్నం అర్బన్, గొలుగొండ, రోలుగుంట, న్యూస్టుడే: గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (14) రోలుగుంట మండలం అడ్డసరంలోని బంధువుల పర్యవేక్షణలో ఉంటూ స్థానిక కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి నెలల వయసులోనే చనిపోగా అడ్డసరం గ్రామానికి చెందిన పిన్నమ్మ నూకాలతల్ల్లి, పినతండ్రి కల్యాణం వద్ద పెరుగుతోంది. రోలుగుంట కేజీబీవీలో చదువుతున్న చిట్టెమ్మ ఈ నెల 27న ఉపాధ్యాయులకు చెప్పకుండా డి.కొత్తూరులోని తండ్రి వీరబాబు వద్దకు వెళ్లింది. ఈమె స్కూల్లో లేని విషయం గమనించిన సిబ్బంది వీరబాబు వద్ద ఉందని నిర్ధారించుకున్నారు. అదేరోజు ఆయనతో కలిసి బాలిక లింగంపేటలోని నూకాలమ్మ జాతరకు వెళ్లింది.
డీఈఓ వెంకటలక్ష్మమ్మకు ఘటన వివరిస్తున్న ప్రిన్సిపల్ తులసి
జాతర ముగిసిన తర్వాత తండ్రి, కుమార్తె, కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుంది. ఈ నెల 28న ఉదయం కేజీబీవీకి వెళ్తానని చెప్పి తండ్రి వద్ద రూ.150 తీసుకుని బయలుదేరింది. గురువారం ఉదయం బాలిక మృతదేహం బొడ్డేరు గెడ్డలో బయటపడింది. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బలవన్మరణానికి పాల్పడిందా... ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. గొలుగొండ ఎస్సై నారాయణరావు నర్సీపట్నం ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. పినతండ్రి కల్యాణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం సాయంత్రం ఆసుపత్రి వద్ద ఓదార్చారు. బాలిక మేనమామ మరువాడ అర్జున మాట్లాడుతూ.. ‘మరణానికి కారణాలేంటో అంతుబట్టడం లేదు. పోస్టుమార్టం నివేదికలో వివరాలు తెలుస్తాయని ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో తెలియడం లేదు. పాఠశాలలో తోటి విద్యార్థినుల వేధింపులేమైనా ఉన్నాయా, ఉపాధ్యాయినులు మందలించారా’ అన్నది తెలుసుకోవాలని డీఈఓను కోరారు. అనంతరం డీఈఓ రోలుగుంటలోని కేజీబీవీకి చేరుకుని విచారణ నిర్వహించారు. చిట్టెమ్మ గోడదూకి పారిపోయిందని సిబ్బంది చెప్పారని, ఇందుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు డీఈఓ చెప్పారు. అనంతరం విద్యార్థినుల వసతి గదులు, వంటగదిని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. డీఈవో వెంట జీసీడీఓ వెంకటలక్ష్మి, ఎంఈఓ సాయిశైలజ, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి తులసి ఉన్నారు.
బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న సీఐ రమణయ్య, ఎస్సై నారాయణరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం