అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (14).
రోలుగుంట కేజీబీవీలో డీఈఓ విచారణ
తుర్రే చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (పాత చిత్రం)
నర్సీపట్నం అర్బన్, గొలుగొండ, రోలుగుంట, న్యూస్టుడే: గొలుగొండ మండలం చోద్యం సమీపంలోని బొడ్డేరు గెడ్డలో ఓ విద్యార్థిని గురువారం శవమై తేలింది. కొయ్యూరు మండలం ఆడాకుల పంచాయతీ డి.కొత్తూరు గ్రామానికి చెందిన అప్పిలి చిన్నారి అలియాస్ చిట్టెమ్మ (14) రోలుగుంట మండలం అడ్డసరంలోని బంధువుల పర్యవేక్షణలో ఉంటూ స్థానిక కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి నెలల వయసులోనే చనిపోగా అడ్డసరం గ్రామానికి చెందిన పిన్నమ్మ నూకాలతల్ల్లి, పినతండ్రి కల్యాణం వద్ద పెరుగుతోంది. రోలుగుంట కేజీబీవీలో చదువుతున్న చిట్టెమ్మ ఈ నెల 27న ఉపాధ్యాయులకు చెప్పకుండా డి.కొత్తూరులోని తండ్రి వీరబాబు వద్దకు వెళ్లింది. ఈమె స్కూల్లో లేని విషయం గమనించిన సిబ్బంది వీరబాబు వద్ద ఉందని నిర్ధారించుకున్నారు. అదేరోజు ఆయనతో కలిసి బాలిక లింగంపేటలోని నూకాలమ్మ జాతరకు వెళ్లింది.
డీఈఓ వెంకటలక్ష్మమ్మకు ఘటన వివరిస్తున్న ప్రిన్సిపల్ తులసి
జాతర ముగిసిన తర్వాత తండ్రి, కుమార్తె, కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి చేరుకుంది. ఈ నెల 28న ఉదయం కేజీబీవీకి వెళ్తానని చెప్పి తండ్రి వద్ద రూ.150 తీసుకుని బయలుదేరింది. గురువారం ఉదయం బాలిక మృతదేహం బొడ్డేరు గెడ్డలో బయటపడింది. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. బలవన్మరణానికి పాల్పడిందా... ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. గొలుగొండ ఎస్సై నారాయణరావు నర్సీపట్నం ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ.. పినతండ్రి కల్యాణం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మ గురువారం సాయంత్రం ఆసుపత్రి వద్ద ఓదార్చారు. బాలిక మేనమామ మరువాడ అర్జున మాట్లాడుతూ.. ‘మరణానికి కారణాలేంటో అంతుబట్టడం లేదు. పోస్టుమార్టం నివేదికలో వివరాలు తెలుస్తాయని ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో తెలియడం లేదు. పాఠశాలలో తోటి విద్యార్థినుల వేధింపులేమైనా ఉన్నాయా, ఉపాధ్యాయినులు మందలించారా’ అన్నది తెలుసుకోవాలని డీఈఓను కోరారు. అనంతరం డీఈఓ రోలుగుంటలోని కేజీబీవీకి చేరుకుని విచారణ నిర్వహించారు. చిట్టెమ్మ గోడదూకి పారిపోయిందని సిబ్బంది చెప్పారని, ఇందుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు డీఈఓ చెప్పారు. అనంతరం విద్యార్థినుల వసతి గదులు, వంటగదిని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. డీఈవో వెంట జీసీడీఓ వెంకటలక్ష్మి, ఎంఈఓ సాయిశైలజ, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి తులసి ఉన్నారు.
బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న సీఐ రమణయ్య, ఎస్సై నారాయణరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు