రూ. కోట్లొచ్చాయ్... కుమ్మరించారు!!
విశాఖ నగరానికి ‘జి-20’ సన్నాహక సదస్సుల పుణ్యమా అని భారీగా నిధులొచ్చాయి. ఇంకేముంది నగర దారులు, మౌలిక వసతులు బాగుపడతాయని ప్రజలు భావించారు. జనం ఒకటి అనుకుంటే... జరిగింది ఇంకొకటి.
తాత్కాలిక పనులకే భారీగా వ్యయం
టెండర్లు లేకుండా కట్టబెట్టిన వైనం!
అధికారుల తీరుపై అనుమానాలెన్నో!!
సీతకొండపై బొమ్మలు
ఈనాడు-విశాఖపట్నం, కార్పొరేషన్-న్యూస్టుడే: విశాఖ నగరానికి ‘జి-20’ సన్నాహక సదస్సుల పుణ్యమా అని భారీగా నిధులొచ్చాయి. ఇంకేముంది నగర దారులు, మౌలిక వసతులు బాగుపడతాయని ప్రజలు భావించారు. జనం ఒకటి అనుకుంటే... జరిగింది ఇంకొకటి.
కొన్ని పనుల తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. తాత్కాలిక అంశాలకూ భారీగా సొమ్ములు కుమ్మరించారు. ఇదెక్కడి చిత్రమంటూ నగరవాసులు విస్తుపోతున్నారు. ఇదేనా సుందరీకరణ అంటూ విమర్శిస్తున్నారు. శాశ్వత పనులకు కాకుండా... తేలిపోయే రంగులు, వాడిపోయే పూల మొక్కలు, తాత్కాలిక విద్యుద్దీపాల అలంకరణలకే నిధులు భారీగా ఖర్చు చేశారు. జీ20’ పేరుతో దాదాపు 420 పనులు చేపట్టారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పర్యాటకశాఖలు సంయుక్తంగా దాదాపు రూ.150 కోట్లు వ్యయం చేసినట్లు అంచనా.
రంగులద్ది..
జి-20 సన్నాహక సమావేశాల నేపథ్యంలో షీలానగర్ నుంచి మద్దిలపాలెం వరకు రహదారిపై డివైడర్ల గ్రిల్స్కు రంగులు వేసేందుకు రూ.3.20 కోట్లు కేటాయించారు. బీచ్ రోడ్డులోని తెన్నేటి పార్కు, సీతకొండల వద్ద పెయింటింగ్ పనులు సాగాయి. ఈ రెండు చోట్లా సాధారణ రంగులద్దడానికి రూ.30లక్షలతో టెండర్లు పిలిచి కేవలం రూ.5లక్షల పనులు చేసి చేతులు దులిపేసుకున్నట్లు విమర్శలున్నాయి. నగరంలో మిగిలిన ప్రాంతాల్లో మీటరుకు రూ.500 ఖర్చు చేసిన జీవీఎంసీ.. తెన్నేటి పార్కు వద్ద మీటరుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తుండటం గమనార్హం. ఇలా ఈ ఒక్క పార్కు వద్దనే రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పులి తల, సింహం బొమ్మల ఖర్చు రూ.లక్షన్నరగా చెప్పగా నగరంలో పేరున్న ఆర్టిస్టులు, పెయింటర్లే ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు సీతకొండ వద్ద కేవలం 5 బొమ్మల ఖరీదు రూ.16లక్షలుగా చూపించారు. ‘ఈ బొమ్మలకు ఇన్నేసి నిధులు వెచ్చిస్తారా’ అని ప్రజలు పేర్కొంటున్నారు.
టెండర్లలోనూ..
టెండరు నిబంధనలు పాటించకుండా కొన్ని పనులకు నిధులు ఖర్చు చేయడం గమనార్హం. జాతీయ రహదారిపై డివైడర్లకు రంగులు వేసే పనులకు వాస్తవానికి మార్చి 7న టెండర్లు ఆహ్వానించారు. అంతకంటే ముందుగానే జీవీఎంసీ అధికారులు కొన్ని పనులు అస్మదీయులకు అప్పగించేశారు. ఇక పెయింటింగ్స్కు షార్ట్ టెండర్ల పేరుతో దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. హడావుడి పనుల పేరిట (షార్ట్ టెండర్లు) నిబంధనలను తుంగలో తొక్కారు. సీతకొండ రాక్ పెయింటింగ్కు మార్చి 21న టెండరు ఓపెన్ చేయగా మార్చి 27న రూ.16.32లక్షలకు అప్పగించారు. అదేవిధంగా తెన్నేటిపార్కు, అప్పుఘర్ వద్ద పెయింటింగ్ పనులకు రూ.11.52లక్షలకు అదే తేదీ, అదే సమయానికి అదే గుత్తేదారుకు ఇచ్చినట్లు చూపించారు. విచిత్రమేమంటే ఈ పనులు ఆన్లైన్లో టెండరు పిలిచే సమయానికే గుత్తేదారుడికి అప్పగించేశారు. నిబంధనలు అమలు చేయాలి కనుక టెండర్లు ఆన్లైన్లో పిలిచి అనుకున్నవారికే అనుమతిచ్చారు. తక్కువ ధరే కోట్ చేసినా...టెండర్లలో ఒకరే పాల్గొంటే తప్పకుండా రెండో సారి పిలవాలి. అదేమీ లేకుండా ఆడిట్లో ఎలాంటి అభ్యంతరాల్లేకుండా పనులు కేటాయించి జేబులు నింపేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చేసిన పనులే చేసి... పైపై పూతలు: గతంలో వేసిన రోడ్లను కొత్తగా వేసినట్లు, గతంలో పూసిన రంగులను కొత్తగా వేసినట్లు చెబుతుండటం గమనార్హం. మైక్రో ట్రెంచ్ విధానంలో ఆరు మిల్లీ మీటర్ల మందంతో రహదారిపై తారు పొర వేయాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా చేసి భారీగా బిల్లులు పెట్టారు. వాస్తవానికి మైక్రోట్రెంచ్ విధానం కాకుండా 25-30ఎంఎం మందంతో తారు లేయర్ వేస్తే నగర రద్దీకి అనుగుణంగా శాశ్వతంగా ఉంటుందని, ప్రస్తుతం వేసిన తేలికపాటి బీటీ పొర వర్షాలకు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బీచ్ రోడ్డులో మరుగుదొడ్లు బాగానే ఉన్నప్పటికీ పునరుద్ధరణ పేరుతో రూ.20లక్షలు దుర్వినియోగం చేశారు. అదే తరహా హనుమంతవాక నుంచి అడివివరం వరకు బీఆర్టీఎస్ రహదారిలో బాగున్న డివైడర్ల (విభాగినుల)కు మరమ్మతుల పేరుతో రూ.40లక్షలు ప్రతిపాదించడం విశేషం.
విదేశీ ప్రతినిధులకు వాస్తవ పరిస్థితులు చూపించకుండా బీచ్ రోడ్డు, స్టార్ హోటళ్ల పరిసరాల్లో సుందరీకరణ పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేశారు. జీవీఎంసీ కార్పోరేటర్లు అలాంటి ఖర్చులకు ఎలా అనుమతులిచ్చారు? ఆ పనులు కేవలం గుత్తేదారులకు లాభాలు కలిగించేవే కానీ ప్రజలకు ఉపయోగపడేవి కావు. ఈ విషయంలో రాష్ట్ర విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేయాలి.
ఇదీ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాసిన బహిరంగ లేఖ సారాంశం.
తెన్నేటి పార్కు సమీపంలో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవీఎంసీ, ఏపీ అర్బన్ గ్రీన్ సంస్థల ద్వారా ఖర్చు చేసిన రూ.150కోట్ల పనులపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలి. జి-20 సదస్సు ముందే ఖరారైనా ఆలస్యంగా స్పందించి షార్ట్ టెండర్ల పేరిట రూ.కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. చేసిన పనులు, ఖర్చు అయిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. కమీషన్లతో రూ.కోట్లు గడించిన జీవీఎంసీ అధికారులపై ఏసీబీ విచారణ జరగాలి.
ఇదీ ‘జి-20’ పనుల తీరుపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ డిమాండ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..