మేమున్నామని.. మీకేం కాదని..
గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక...
భరోసా కల్పిస్తున్న ‘విన్’ కౌన్సెలింగ్ కేంద్రం
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ
కౌన్సెలింగ్ చేస్తున్న నిపుణులు
గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక... పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేక తమలో తాము మదనపడే వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది ‘విన్’ కౌన్సెలింగ్ సెంటర్. నగర పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సుమారు 98 శాతం మేర పరిష్కారాలతో బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నారు.
వివిధ విభాగాల నిపుణులతో ...
వేధింపులకు గురవుతున్నా.. కొందరు మహిళలు పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయటానికి సంకోచిస్తుంటారు. అలాంటి వారి సమస్యలు కూడా పరిష్కారమవ్వాలనే ఉద్దేశంతో నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉమన్ ఇన్ నీడ్ (విన్)పేరిట కౌన్సెలింగ్ సెంటర్ పోలీసు బ్యారక్స్లో ప్రస్తుతం నడుస్తోంది.
వారంలో రెండు రోజులు..
ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ కేంద్రం పనిచేస్తుంది. ఈ కౌన్సెలింగ్ కేంద్రం దిశా పోలీసు స్టేషన్ ఏసీపీ నేతృత్వంలో నడుస్తోంది. మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మానసికశాస్త్ర నిపుణులు, పోలీసుశాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండి మహిళల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. బాధిత మహిళలు విన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి వినతిరూపంలో తమ సమస్యలు తెలియజేయవచ్చు.
నెలలో 100 ఫిర్యాదులు
* నెలకు సుమారు 100కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు.
* కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న వారిలో అత్యధికులు అవివాహితులు ఉంటున్నారు. ప్రేమ వైఫల్యం, వివాహేతర సంబంధాల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఫిర్యాదు చేసేవారిలో విద్యావంతులైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో 45 నుంచి 50 శాతం మంది తమ తప్పును తెలుసుకుని తిరిగి సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారు.
గోప్యత పాటిస్తాం
- మాధవి గణపతి, ప్రతినిధి, వాసవ్య మహిళా మండలి
విన్ కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. మహిళలు వారి జీవితాల్లో జరిగే పరిణామాల్ని విశ్లేషించుకుని, పరిష్కారమార్గాలను ఆలోచించుకోవాలి. ప్రధానంగా జవాబుదారితనం లేకపోవటం, అహంకారం వంటి వాటి కారణంగానే ఎక్కువ మంది మహిళలు బాధితులుగా మారుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు, సూచనలతో సంతోషకరమైన జీవనానికి దోహదపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ