మేమున్నామని.. మీకేం కాదని..
గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక...
భరోసా కల్పిస్తున్న ‘విన్’ కౌన్సెలింగ్ కేంద్రం
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ
కౌన్సెలింగ్ చేస్తున్న నిపుణులు
గృహ హింసకు గురవుతున్న మహిళ కావచ్చు... ప్రేమలో పడి మోసపోయిన యువతి కావచ్చు... పనిచేసే చోట వేధింపులకు గురవుతున్న ఉద్యోగిని కావచ్చు... బయటకు చెప్పుకోలేక... పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేక తమలో తాము మదనపడే వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది ‘విన్’ కౌన్సెలింగ్ సెంటర్. నగర పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు సుమారు 98 శాతం మేర పరిష్కారాలతో బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నారు.
వివిధ విభాగాల నిపుణులతో ...
వేధింపులకు గురవుతున్నా.. కొందరు మహిళలు పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయటానికి సంకోచిస్తుంటారు. అలాంటి వారి సమస్యలు కూడా పరిష్కారమవ్వాలనే ఉద్దేశంతో నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉమన్ ఇన్ నీడ్ (విన్)పేరిట కౌన్సెలింగ్ సెంటర్ పోలీసు బ్యారక్స్లో ప్రస్తుతం నడుస్తోంది.
వారంలో రెండు రోజులు..
ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ కేంద్రం పనిచేస్తుంది. ఈ కౌన్సెలింగ్ కేంద్రం దిశా పోలీసు స్టేషన్ ఏసీపీ నేతృత్వంలో నడుస్తోంది. మహిళా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మానసికశాస్త్ర నిపుణులు, పోలీసుశాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండి మహిళల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారు. బాధిత మహిళలు విన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి వినతిరూపంలో తమ సమస్యలు తెలియజేయవచ్చు.
నెలలో 100 ఫిర్యాదులు
* నెలకు సుమారు 100కుపైగా ఫిర్యాదులు అందుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు.
* కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్న వారిలో అత్యధికులు అవివాహితులు ఉంటున్నారు. ప్రేమ వైఫల్యం, వివాహేతర సంబంధాల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఫిర్యాదు చేసేవారిలో విద్యావంతులైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో 45 నుంచి 50 శాతం మంది తమ తప్పును తెలుసుకుని తిరిగి సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారు.
గోప్యత పాటిస్తాం
- మాధవి గణపతి, ప్రతినిధి, వాసవ్య మహిళా మండలి
విన్ కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. మహిళలు వారి జీవితాల్లో జరిగే పరిణామాల్ని విశ్లేషించుకుని, పరిష్కారమార్గాలను ఆలోచించుకోవాలి. ప్రధానంగా జవాబుదారితనం లేకపోవటం, అహంకారం వంటి వాటి కారణంగానే ఎక్కువ మంది మహిళలు బాధితులుగా మారుతున్నారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణుల సలహాలు, సూచనలతో సంతోషకరమైన జీవనానికి దోహదపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే