logo

Vizag: 15 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 టికెట్ల విక్రయాలు

విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి తెలిపారు.

Updated : 14 Nov 2023 08:19 IST

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 23న జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి తెలిపారు. 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్‌ ద్వారా విక్రయాలు జరుగుతాయన్నారు. 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, పాతనగరంలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలలో లభిస్తాయన్నారు. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు