కబ్జా దాహం.. అడుగుకో వ్యూహం!
కళ్ల ముందు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు విశాఖలో వైకాపా నాయకులు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా కరాస పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పావులు కదిపారు.
ఈనాడు-విశాఖపట్నం: కళ్ల ముందు ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు విశాఖలో వైకాపా నాయకులు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా కరాస పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పావులు కదిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా, ఆక్రమణపై ఎవరూ ప్రశ్నించకుండా కొత్త ఎత్తుగడ వేశారు. జీవీఎంసీకి చెందిన యంత్రాలతో పనులు చేస్తే ఎవరూ దృష్టిసారించరని భావించారు. దర్జాగా మూడు రోజులుగా జేసీబీలతో చెట్లు తొలగిస్తూ.. మట్టి చదును పనులు చేపడుతున్నారు. ఈ స్థలం వద్ద ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యంతో నిఘా ఏర్పాటు చేయడం గమనార్హం.
పూరిపాకతో మొదలు...
కరాసలో పోలీస్ క్వార్టర్స్, ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియాకు కేటాయించిన స్థలాల మధ్య సర్వే నెంబరు 112లో విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత స్థలంలో శ్మశాన వాటికతోపాటు, జీవీఎంసీ డంపింగ్ యార్డు ఉంది. తారు రోడ్డు ఆనుకుని సుమారు రెండు వేల చదరపు గజాల భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఐదేళ్ల కిందట ఈ ఖాళీ స్థలంలో వైకాపా నాయకుడు ఒకరు పూరి పాక ఏర్పాటు చేశారు. దీనికి స్థానికులు అభ్యంతరం చెప్పడం, అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే తొలగించారు. వైకాపా అధికారంలోకి రాగానే సదరు నేత మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల ఇసుక, కంకర నిల్వలు ఖాళీ స్థలంలో డంప్ చేశారు. మరికొన్ని రోజులకే యాష్ బ్రిక్స్తో రక్షణ గోడ, ఓ గేటు సైతం ఏర్పాటు చేశారు.
వ్యర్థాలతో పూడ్చుతూ: శిథిల భవనాల వ్యర్థాలను ఈ స్థలం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో డంప్ చేస్తున్నారు. రాత్రిళ్లు జీవీఎంసీ జేసీబీలతో ఈ వ్యర్థాలను తెచ్చి కబ్జాకు పావులు కదిపిన స్థలంలో నింపుతూ చదును చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను సైతం ఇక్కడ నేలకూల్చారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో గజం రూ.80 వేల ధర పలుకుతోంది. అలా...రూ.16 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నర్సరీ ముసుగులో..: ఎవరైనా స్థలం గురించి ఆరా తీస్తే నర్సరీ ఏర్పాటు చేస్తున్నట్లు కొత్త కథ అల్లుతున్నారు. ఆక్రమణ అని ప్రతిపక్ష పార్టీలు గళమెత్తితే అందుకు తగ్గట్టు ఆధారాలు సిద్ధం చేసుకునేలా అడుగులు పడ్డాయి. గ్రీన్ క్లైమెట్ టీం కోరిక మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల శిక్షణ, పర్యావరణ విద్యా వనరుల కేంద్రానికి స్థలానికి స్థలం అందించాలంటూ అక్టోబర్లో ఓ లేఖ ఓ కీలక నేత ద్వారా కార్పొరేషన్లో ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్