logo

ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్‌: గంటా

‘అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్‌మోహన్‌రెడ్డి గారు..’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్‌ ద్వారా స్పందించారు.

Published : 06 Dec 2023 04:13 IST

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: ‘అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్‌మోహన్‌రెడ్డి గారు..’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకొచ్చిందా? మీ రాజధాని మాకొద్దు మహాప్రభో, మా విశాఖలో మునుపటి ప్రశాంతతను మిగల్చండని విశాఖ వాసులు వాపోతున్నారు. 2024లో మీ ప్రభుత్వ పతనం ఇదే విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోండి.  రుషికొండను టూరిజం రిసార్టు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేసి పరిమితికి మించి నిర్మాణాలు చేపట్టారు. టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి రూ.140 కోట్లు బ్యాంకుల నుంచి రుణం తెచ్చి దాదాపు రూ.500 కోట్లు సి.ఎం.కార్యాలయానికి వెచ్చించారు. మీకు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం నిజంగా గుర్తుంటే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే భోగాపురం ఎయిర్‌పోర్టు, రైల్వే జోన్‌, మెట్రో, స్టీల్‌ప్లాంటు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చగలిగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి పాటుపడేవారు’ అంటూ గంటా తన ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు