డ్వాక్రా సొమ్ము పక్కదారి
డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా..
‘వెలుగు’ సీసీ సస్పెన్షన్
ఎం.పద్మ
పద్మనాభం, న్యూస్టుడే: డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా.. పద్మనాభం మండలంలోని ఒక్క పద్మనాభం పంచాయతీలోనే ‘వెలుగు’ వి.ఒ.ఎ. (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్), సి.సి.(క్లస్టర్ కోఆర్డినేటర్) కలిసి సుమారు రూ.20లక్షల మేర అక్రమాలకు పాల్పడ్డారు. తొలుత ఈ విషయమై ‘జేకేసీ’ (జగనన్నకు చెబుదాం) విభాగానికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో సంబంధిత అధికారులు వి.ఒ.ఎ.ను బాధ్యురాలిని చేసి ఆమెను విధుల నుంచి తొలగించి చేతులు దులిపేసుకున్నారు. ఈ ఘటనలో వెలుగు మహిళా సమాఖ్య సీసీ ఎం.పద్మ హస్తం కూడా ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో శాఖా పరమైన విచారణ చేపట్టారు. పొదుపు సంఘాల సభ్యుల నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ రశీదులు సృష్టించి పక్కదారి పట్టించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దాంతో పద్మనాభం మండల వెలుగు సీసీ ఎం.పద్మను జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి.సూరమ్మ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే..: వెలుగులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇటువంటి ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువ మందికి చదువు లేకపోవడంతో సిబ్బందిని నమ్మి మోసపోతున్నారు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో గతంలో సుమారు రూ.కోటిన్నర మేర అక్రమాలు జరగ్గా అధికారులు సంబంధిత వ్యక్తి నుంచి రికవరీ చేశారు. తాజాగా పద్మనాభంలో జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఏపీఎం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మండలంలోని ‘వెలుగు’ కార్యకలాపాలపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటకొస్తాయని కొందరు బాహాటంగా చెబుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి