వైకాపా నాయకుల... భూదాహం
అధికార వైకాపా నేతలు కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెగించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిధిలో ఏకంగా ప్రభుత్వ భూమిని చదును చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు.
కీలక నేత అనుచరుల ఆక్రమణ పర్వం
ఎనిమిది ఎకరాల కొండ పోరంబోకు చదును
రూ.4 కోట్ల భూమి అమ్మకానికి వ్యూహం
ఆక్రమణకు గురైన భూమి ఇదే
ఈనాడు-విశాఖపట్నం: అధికార వైకాపా నేతలు కొందరు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తెగించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల పరిధిలో ఏకంగా ప్రభుత్వ భూమిని చదును చేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. దస్త్రాల్లోని కొన్ని లోపాలను అడ్డం పెట్టుకొని చక్రం తిప్పారు. కృష్ణాపురం గ్రామంలో సర్వే నెంబరు 82-2లో ప్రభుత్వ కొండ పోరంబోకు భూమి ఉంది. ఇందులో సుమారు 8 ఎకరాలను స్థానిక వైకాపా నాయకులు ఆరు నెలల క్రితం చదును చేసి గుప్పిట్లో పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ స్థలంలోకి ఎవ్వరూ కాలు పెట్టకూడదన్న ఆలోచనతో ఓ షెడ్డు నిర్మించి అందులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ షెడ్డు గోడలపై ‘స్థలం హక్కుదారులంటూ’ పేర్లు రాశారు. ఇలా కబ్జా గుప్పిట్లోకి వెళ్లిన భూమి పద్మనాభం-తగరపువలస ప్రధాన రహదారి పక్కన ఉన్న వెంగమాంబ-ఎన్బీసీ క్వారీల మధ్య ఉంది. ఇక్కడ ఎకరా దాదాపు రూ.60 లక్షల వరకు ధర పలుకుతుంది.
ఈ భూమిని ప్రస్తుతం అమ్మేందుకు ప్రణాళిక రచించారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి 8 ఎకరాలను రూ.4 కోట్లకు బేరం కుదిర్చినట్లు సమాచారం. అడ్వాన్సుగా ఇటీవల కొంత చేతులు మారినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఆక్రమణలో కీలకంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. ఆ ఇద్దరు స్థానిక అధికార ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరులుగా ముద్ర వేసుకున్నారు. దీంతో ఈ ఆక్రమణపై స్థానికంగా ఎవరూ నోరెత్తే సాహసం చేయడం లేదు.
నిర్మించిన షెడ్
కృష్ణాపురం గ్రామం అన్సెటిల్డ్ విలేజ్ కింద ఉంది. ఎవరైనా తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపిస్తే రెవెన్యూలోని పాత అడంగళ్ ఆధారంగా అధికారులు పొజిషన్ ఇవ్వడం అక్రమార్కులకు వరమైంది. ఆక్రమణలో ఉన్న 8 ఎకరాల్లో సుమారు 60 సెంట్లను ఇప్పటికే జిరాయితీగా రికార్డుల్లోకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారి ఒకరు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమిత స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో ఇది సున్నితమైన అంశంగా మారింది.
ఇలా అయితేనే అధికారులు కూల్చకుండా ఉంటారని ఎత్తుగడ వేశారు. అదే సాకుగా చూపిస్తూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా... ప్రస్తుత ఆక్రమణపై పరిశీలిస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ ఫిర్యాదు వస్తే క్షేత్రస్థాయికి వెళ్లి చూడగా, రేకుల షెడ్లో విగ్రహం ఉంది. ఈ షెడ్ పైకప్పును ఎవరో ధ్వంసం చేశారని పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు సైతం ఉన్నట్లు తెలిసింది. సున్నితమైన విషయం కనుక ఆ షెడ్డుపై చర్యలు తీసుకోలేదని డిప్యూటీ తహసీల్దార్ సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం