ముంచెత్తిన ‘మిగ్జాం’
‘మిగ్జాం’ తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో గెడ్డలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.
లోతట్టుప్రాంతాలు జలమయం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
ఆర్కే బీచ్లో కెరటాల ఉద్ధృతి
‘మిగ్జాం’ తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో గెడ్డలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. బాపట్లలో తుపాను తీరం దాటే సమయంలో ఇక్కడ కూడా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) వెబ్సైట్ ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో సరాసరి 5 సెం.మీ., 12 ప్రాంతాల్లో 4 సెం.మీ., 59 ప్రాంతాల్లో 3 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. మత్స్యకారులు 48 గంటల వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. విశాఖ పోర్టులో మూడో నెంబరు ప్రమాద సూచిక కొనసాగిస్తున్నారు.
పెదగదిలి బీఆర్టీఎస్ రహదారిలో నిలిచిన వర్షం నీరు
యంత్రాంగం అప్రమత్తం
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో యంత్రాంగం అప్రమత్తత చర్యలను కొనసాగిస్తోంది. కలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, తహసీల్దారు కార్యాలయాలు, జీవీఎంసీలో ఏర్పాటు చేసిన నియంత్రణ గదులను కొనసాగిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్ మల్లికార్జున ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు ఇస్తున్నారు. అవసరమైతే తక్షణమే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. పంటలకు జరిగిన నష్టంపై కలెక్టర్ వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇంత వరకు నష్టాలు నమోదు కాలేదని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని, బుధవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా బోట్లు చేపలరేవులో నిలిచిపోయాయి. వర్షాలు తగ్గితే బుధవారం సాయంత్రం నుంచి వేటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
చినగదిలిలో వర్షంలోనే రేషన్కు వరుసలో ఉన్న స్థానికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు