logo

8న అగ్నిప్రమాద బాధితులకు తెదేపా ఆర్థిక సాయం

చేపలరేవులో అగ్నిప్రమాదానికి ఆహుతైన బోట్లకు చెందిన ఆపరేటర్లకు, ఉపాధి కోల్పోయిన 400 మంది మత్స్యకారులకు ఈనెల 8న తెదేపా తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 07 Dec 2023 02:59 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: చేపలరేవులో అగ్నిప్రమాదానికి ఆహుతైన బోట్లకు చెందిన ఆపరేటర్లకు, ఉపాధి కోల్పోయిన 400 మంది మత్స్యకారులకు ఈనెల 8న తెదేపా తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రూ.60లక్షల మేర సాయం అందజేస్తున్నామన్నారు. పూర్తిగా దగ్ధమైన బోట్లకు రూ.లక్ష, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.5వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11.30గంటలకు చేపలరేవులో జరిగే కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేస్తారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని