23న సింహగిరిపై వైకుంఠ ఏకాదశి ఉత్సవం
సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.
సింహాచలం, న్యూస్టుడే: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కొండ దిగువన విజయరామరాజు భవనంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 23న వేకువజామున 4.15 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్తర ద్వారంలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయ ఉత్తర గోపురంలో భక్తులకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. ఈ ఏడాది ఈ ఉత్సవం శనివారం రావడంతో సుమారు 50వేల మందికి పైగా భక్తులు తరలివస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ రోజు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తారు. మిగిలిన వారంతా నీలాద్రి గుమ్మం వద్ద నుంచే దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు అందుబాటులో ఉంటాయి. దర్శనం అనంతరం భక్తులకు పొంగలి, పులుసు ప్రసాదం పంపిణీ చేస్తారు. అన్ని ప్రభుత్వ శాఖల సహాయంతో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐ.వి.రమణాచార్యులు, నగర ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ రాజీవ్కుమార్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, రాంబాబు, ట్రస్టుబోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేశ్రాజ్, శ్రీదేవి వర్మ, సువ్వాడ శ్రీదేవి, రామలక్ష్మీ, రాజేశ్వరి, సాయినిర్మల, ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం