విరిగిపడిన కొండచరియలు
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
అరకు మార్గంలో నిలిచిన రాకపోకలు
శృంగవరపుకోట, న్యూస్టుడే: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా, అనంతగిరి మార్గంలో బుధవారం ఉదయం కొండచరియలు విరిగి పడడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. జిల్లాలోని బొడ్డవర చెక్పోస్టు వద్ద అరకువైపు వెళ్లే వాహనాలను ఎస్.కోట పోలీసులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం రాత్రి అరకు సమీప బీసుపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలు నిలిపివేశారు. పర్యాటకుల తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సుల్లోనే అవస్థలు పడ్డారు. పునరుద్ధరిస్తున్న సమయంలో అనంతగిరి మార్గంలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో ఎస్.కోట పోలీసులు బొడ్డవర చెక్పోస్టు నుంచి నాలుగు ఆర్టీసీ బస్సులను పంపారు. వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతుండడంతో బుధవారం రాత్రి 8 గంటలకు నుంచి అరకు వైపు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నామని, గురువారం కూడా అనుమతించబోమని సీఐ బాలసూర్యారావు తెలిపారు. ఈ మార్గంలో కొండచరియలు పడే ప్రమాదం ఉందంటూ అనంతగిరి ఎస్ఐ అందించిన సమాచారంతో బొడ్డవర వద్ద ఎస్.కోట పోలీసులు రాత్రి 8 గంటల సమయం నుంచి వాహనాలను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను సైతం వెళ్లకుండా చూస్తున్నారు. గురువారం కూడా రాకపోకలు నిలిపివేస్తామని ఎస్.కోట ఎస్ఐ లోవరాజు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
రైల్వేమార్గంలోనూ...: కేకే రైల్వేలైనులో తైడా సమీపంలో విద్యుత్తు తీగలపై చెట్లు పడడంతో లైనులో మంటలు చెలరేగాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మంగళవారం అరకులో ఆగిపోయిన పాసింజరు రైలును మాత్రం బుధవారం విశాఖ పంపారు. విశాఖ నుంచి పాసింజరు రైళ్లు రాలేదు. విద్యుత్తు లైను పునరుద్ధరించారు. గూడ్సు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?