logo

నేడు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ

ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో గురువారం జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు.

Updated : 07 Dec 2023 03:22 IST

ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఏర్పాట్లు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో గురువారం జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. బుధవారం ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్‌ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మైదానానికి చేరుకుంటారన్నారు. మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల సమస్యలు, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరాన్ని సభలో ప్రస్తావిస్తారన్నారు. రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలనే అంశంపై 100 రోజుల ప్రణాళికను వివరిస్తారని తెలిపారు. జనసేన నాయకులు కోన తాతారావు మాట్లాడుతూ బహిరంగ సభ తర్వాత పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.

జనసేనలోకి సుందరపు సతీష్‌: ఎలమంచిలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి సుందరపు విజయ్‌కుమార్‌ సోదరుడు సుందరపు సతీష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. పవన్‌కల్యాణ్‌ సమక్షంలో గురువారం పార్టీలో చేరుతున్నారన్నారు. విలేకర్ల సమావేశంలో సుందరపు విజయ్‌కుమార్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, పంచకర్ల సందీప్‌, శివప్రసాద్‌, నాగలక్ష్మీ, ప్రశాంతి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని