వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం..
కశింకోట, న్యూస్టుడే: జాతీయ రహదారి కశింకోట సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయిని మృతిచెందగా మరో ఉపాధ్యాయిని తీవ్రంగా గాయపడింది. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కూండ్రం గ్రామానికి చెందిన సేనాపతి శిరీషాజ్యోతి (26) తన స్వగ్రామం నుంచి బైక్పై పాఠశాలకు వస్తూ కశింకోటలో మరో ఉపాధ్యాయిని కర్రి భాగ్యశ్రీతో బైక్పై తీసుకుని వెళ్తోంది. పాఠశాలకు కొద్ది దూరంలోనే వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో తూలిపడి లారీ చక్రం తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన భాగ్యశ్రీని అనకాపల్లి ప్రాంతీయాసుపత్రికి అక్కడి నుంచి విశాఖకు తరలించారు. రెండేళ్లగా పాఠశాలలో పనిచేస్తున్న శిరీషాజ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సీఐ ఎ.రవికుమార్, ఎస్సై జె.నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.
కశింకోట: జాతీయరహదారి బయ్యవరం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఎస్సై జె.నాగేశ్వరరావు కథనం ప్రకారం.. జమాదులపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి శ్రీను (43) బయ్యవరం సిమెంటు కర్మాగారంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామం వెళుతుండగా ఇక్కడ పెట్రోలు బంకు సమీపంలో ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో ఆర్టీసీ కండక్టర్..
అనకాపల్లి పట్టణం, రావికమతం, న్యూస్టుడే: కేఎన్ఆర్ పేటలో విద్యుదాఘాతంతో ఆర్టీసీ కండక్టర్ మృతిచెందారు. గ్రామీణ పోలీస్స్టేషన్ ఎస్సై సీహెచ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరావు (53) బుధవారం ఉదయం మోటారు వద్ద వర్షం నీరు చేరడంతో దీన్ని బయటకు పంపే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రావికమతం మండలం కొత్తకోటకు చెందిన కోట శ్రీనివాసరావు కేఎన్ఆర్ పేటలో ఉంటూ గాజువాక డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు.
చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు..
రాంబిల్లి, న్యూస్టుడే: దిమిలిలో చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు మృతి చెందింది. దీనిపై ఎస్సై డి.దీనబంధు కథనం ప్రకారం.. నగిరెడ్డి పైడితల్లి (77) మంగళవారం రాత్రి కట్టెల పొయ్యిపై చలిమంట కాగుతుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం