తుపాను పంజా కుంభవృష్టి... ముంచేసింది!!
‘మిగ్జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి.
పొంగిన గెడ్డలు.. కూలిన గోడలు
నీట మునిగిన పంటలు
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
‘మిగ్జాం’ తుపాను బలహీనపడిన తర్వాత జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ప్రహరీలు కూలిపోయాయి. పార్కుల్లో, రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. గెడ్డలు పొంగిపొర్లాయి. మురుగు, వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. భీమిలి, రుషికొండ, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో తీర ప్రాంతం కోతకు గురైంది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వ్యాపారాలు మూతపడ్డాయి. దుకాణాలు తెరవకపోవడంతో నష్టపోయామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గురు, శుక్రవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
- 59వ వార్డు ఎక్స్సర్వీస్మెన్ కాలనీలోని కొండ వాలులో రాళ్లు జారడంతో ఓ ఇంటి ముందుభాగం కూలిపోయింది. పెదగంట్యాడ హెచ్బీ కాలనీలో పాత ఇంటిపై గోడ కూలగా... ఎవరికీ ప్రమాదం జరగలేదు. నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద గోడ కూలి ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో రాళ్లు, మట్టిపెళ్లలు జారిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాల్తేరులోని తుపాను హెచ్చరికల కేంద్రానికి సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. బీహెచ్పీవీలో జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో 33 కేవీ లైనుకు చెందిన విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
- భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో 500 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పరవాడ మండలంలో 40 ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నేలవాలింది.
న్యూస్టుడే, పెందుర్తి: పెందుర్తి మండలంలోని గుర్రంపాలెం పంచాయతీలో జగనన్న కాలనీ నీట మునిగింది. వర్షాలకు కొండవాలు నుంచి పారుతున్న నీరు నేరుగా కాలనీలోకి చేరుతోంది. కిందికి వెళ్లే మార్గం లేకపోవడంతో అక్కడే నిలిచిపోతుంది. అధికారులు స్పందించి, పరిష్కారం చూపాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ