Hanuman: హను-మాన్ @ పాడేరు
అధునాతన సాంకేతికతను రంగరించి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా హను-మాన్. చీడికాడ మండలం కోనాం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
కోనాంలోనూ చిత్రీకరణ
గ్రాఫిక్స్ మాంత్రికుడు చోడవరం వాసే
మంచుకొండలో హనుమంతుడు
చోడవరం/గ్రామీణం, న్యూస్టుడే: అధునాతన సాంకేతికతను రంగరించి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా హను-మాన్. చీడికాడ మండలం కోనాం జలాశయం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేసిన పి.ఉదయ్కృష్ణ చోడవరం ప్రాంతానికి చెందిన వారే. ఈయన ఆరు నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు పండమనేటి సీతారామమూర్తి, అన్నపూర్ణ. తండ్రి చోడవరం ట్రెజరీలో పనిచేశారు. జిల్లా ట్రెజరీ అధికారిగా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటున్నారు. ఉదయ్కృష్ణ హైదరాబాద్లోనే సినీ కెరీర్ను ప్రారంభించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు పనిచేశారు. తక్కువ బడ్జెట్, పరిమిత వనరులతోనూ సమర్థంగా పనిచేస్తారన్న పేరు గడించారు. చెన్నై, బెంగళూరు, ముంబయిలలో బహుళ జాతీయ కంపెనీల ప్రచారంతోపాటు బాలీవుడ్, హాలీవుడ్లోనూ పనిచేశారు. బాహుబలి సినిమా గ్రాఫిక్స్లోనూ కొంతవరకు పనిచేశారు. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో రెండున్నర దశాబ్దాల అనుభవం గడించాక హను-మాన్ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్కు పాడేరు గిరులను అనుసంధానం చేశారు. తన స్నేహితుడు చోడవరానికి చెందిన ఫొటోగ్రాఫర్ కోరుకొండ సత్యనారాయణమూర్తి (సత్తిబాబు)తో కలిసి వారంపాటు పాడేరులో తిరిగారు. మూడు వేలకుపైగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని హను-మాన్ సినిమాలో గ్రాఫిక్స్కు అనుగుణంగా వాడారు. బాల్య స్నేహితుడు గరిమెళ్ల కృష్ణ వచనా కవిత్వం తనను ఆకట్టుకుందని ఉదయ్కృష్ణ చెప్పారు. వినాయక ఉత్సవాల్లో నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూడటం, నాటికలు వేయడం సృజనాత్మక రంగంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయని తెలిపారు. ‘ఉదయ్కృష్ణ బీస్ట్ బెల్స్’ పేరుతో హైదరాబాద్లో విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
పాడేరులోదే ఈ సుందర దృశ్యం
ఉదయ్కృష్ణ
సత్యనారాయణమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
[ 10-05-2024]
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పోలింగ్ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు
[ 10-05-2024]
పోలింగ్ బృందాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. -
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
[ 10-05-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం జరిపిన మలి దఫా చర్చలు గురువారం అసంపూర్తిగా ముగిశాయని పోర్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. -
జగన్.. ఏంటీ కనికట్టు!!
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. -
ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
[ 10-05-2024]
పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. -
వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
[ 10-05-2024]
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్
[ 10-05-2024]
కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి
[ 10-05-2024]
దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం
[ 10-05-2024]
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. -
మున్సిపల్ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు
[ 10-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (హైదరాబాద్) ఒక ప్రకటనలో తెలిపింది. -
మాజీ కౌన్సిలర్ దంపతుల ఓట్లు గల్లంతు..
[ 10-05-2024]
జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్. -
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు..
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు