స్మార్ట్ బాదుడుకు ‘సిద్ధం’..!
విద్యుత్తు ఛార్జీలు పెంచలేదంటూనే వినియోగదారులపై స్మార్ట్ బాదుడుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాడిన కరెంటు ఛార్జీల కంటే ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ-1, 2 పేరుతో అదనంగా వడ్డిస్తోంది.
వినియోగదారులపై ప్రీపెయిడ్ మీటర్ల కొనుగోలు భారం
తొలుత వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలకు మార్పు
200 యూనిట్లపైబడి వాడే గృహాలకు అమర్చే యోచన
ఈనాడు, అనకాపల్లి
విద్యుత్తు ఛార్జీలు పెంచలేదంటూనే వినియోగదారులపై స్మార్ట్ బాదుడుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇప్పటికే వాడిన కరెంటు ఛార్జీల కంటే ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ-1, 2 పేరుతో అదనంగా వడ్డిస్తోంది. తాజాగా స్మార్ట్ మీటర్ల భారాన్ని వినియోగదారుల నెత్తిన పెట్టబోతోంది. ఈ నెలలోనే కొన్ని రకాల కేటగిరీ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చబోతున్నారు. ఈ మీటర్ల కొనుగోలు నుంచి ఇన్స్టాలేషన్ వరకు అయ్యే వ్యయాన్ని ఆయా కేటగిరీల వారి నుంచి నెలవారీ బిల్లుల ద్వారా ఈఎంఐ రూపంలో వసూలు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవసరమైన మీటర్లు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. వీటిని అమర్చే బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ సిబ్బంది గత కొద్ది రోజులుగా ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనే మకాం వేసి మీటర్ టెస్టింగులు చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 17.66 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో వాణిజ్య, పరిశ్రమ, ప్రభుత్వ సంస్థల కేటగిరీ కనెక్షన్లు కలిపి 2.05 లక్షలున్నాయి. తొలుత ఈ మూడు కేటగిరీల మీటర్లను మార్చి స్మార్ట్ కమ్ ప్రీపెయిడ్ మీటర్లను అమర్చనున్నారు. తర్వాత దశలో 200 యూనిట్ల పైగా వినియోగించే గృహ విద్యుత్తు కనెక్షన్లకు మార్పు చేయనున్నారు. ఏడాది క్రితమే నగరంలో వంద చోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చి కొన్ని నెలలు పరీక్షించి చూశారు. ఆ తర్వాత మీటర్ల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలవడం, గుత్తేదారు సంస్థలను ఖరారు చేసే ప్రక్రియలు చేపట్టారు. ఇందులోనే సర్కారు ముందుగా అనుకున్న సంస్థలకు కట్టబెట్టేలా వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండానే ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే బాధ్యతను ముఖ్యమంత్రి సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అప్పగించారు. మిగతా కేటగిరీలకు చెందిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల టెండర్లు అదాని సంస్థకు కేటాయించారు.
మీటరు భారం 93 నెలలు.... వ్యవసాయ విద్యుత్తు మీటర్ల ఖర్చుని రైతులపై వేయడం లేదని ఆ మొత్తం తామే భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కేటగిరీల మీటర్ల ఖర్చుని మాత్రం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఒక్కో స్మార్ట్ మీటర్పై సుమారు రూ.13 వేలు వరకు ఖర్చుచేయబోతున్నారు. నెలనెలా వినియోగించిన కరెంటు ఛార్జీలకు అదనంగా మీటర్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం సుమారు రూ.90 ఈఎంఐగా బిల్లులో కలిపే ఇవ్వనున్నారు. ఇలా 93 నెలల్లో మీటరు ఏర్పాటు వ్యయాన్ని వినియోగదారుడి నుంచి రాబట్టుకోనున్నారు. అప్పటి వరకు మీటర్ల నిర్వహణ మొత్తం అదానీ సంస్థ బాధ్యత వహిస్తుంది.
గృహ వినియోగదారుల మెడపై కత్తి..
ఉమ్మడి జిల్లాలో 15 లక్షలకు పైగా గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 200 యూనిట్లు పైబడి వాడిన కనెక్షన్లు సుమారు 8 లక్షల పైగా ఉంటాయని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. మొదట వాణిజ్య, పరిశ్రమలకే స్మార్ట్ మీటర్లు అన్నారు. తర్వాత గృహ వినియోగదారులు కోరితే ఏర్పాటు చేయాలని అంటూనే 200 యూనిట్లు వినియోగం దాటిన కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందర గృహ వినియోగదారులపై స్మార్ట్ భారం పెట్టకూడదని పునరాలోచన చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు స్మార్ట్ మీటర్లను గృహ వినియోగదారులపై రుద్దకపోయినా దశల వారీగా అన్ని కేటగిరీలు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు తప్పనిసరి చేయనున్నారు. వీటితో మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఉపాధికి దెబ్బ తగలనుంది. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చిన తర్వాత మీటర్ రీడింగ్ తీసే పని ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు