బటన్ నొక్కి నెల.. ఆసరా అందేనా?
ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. ఇటీవల పథకాలకు సంబంధించి ఏ బటన్నొక్కినా నగదు సకాలంలో ఖాతాల్లోకి జమ కావడం లేదు.
బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న మహిళలు
పాడేరు, కలెక్టరేట్, న్యూస్టుడే
ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాను ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించి ప్రచారాన్ని మార్మోగిస్తున్నారు. ఇటీవల పథకాలకు సంబంధించి ఏ బటన్నొక్కినా నగదు సకాలంలో ఖాతాల్లోకి జమ కావడం లేదు. దీంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఖాతాల్లోకి నగదు పడాలంటే నెలల తరబడి లబ్ధిదారులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి పథకాలకు సంబంధించి బటన్నొక్కినా సొమ్ము రావడానికి నెలపైనే సమయం పట్టింది.
గత నెల 23న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ బహిరంగ సభలో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద నాలుగో విడత బటన్ నొక్కారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 34,944 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,63,479 మంది మహిళలకు రూ.273.56 కోట్లు, అల్లూరి జిల్లాలో 8,664 స్వయం సహాయక సంఘాలకు రూ.34.6 కోట్లు వైఎస్ఆర్ ఆసరా మంజూరైందని అధికారులు ప్రకటించారు.వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామని కలెక్టర్, అధికారులు, డ్వాక్రా మహిళలతో కలసి నమూనా చెక్కును సైతం విడుదల చేశారు. నాలుగు వారాలు దాటినా కనీసం 50 శాతం మంది లబ్ధిదారులు ఖాతాల్లోకి కూడా నగదు జమకాలేదు. దీంతో మహిళలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఖాతాను చెక్ చేసుకుంటున్నారు. ఎప్పుడు పడతాయో అర్థంకాక ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల్లో సంబరాలు చేసి..
ఆసరా పేరిట నియోజకవర్గాల్లో సంబరాలు పేరిట సభలు నిర్వహించారు. ఈ సభలకు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. ఆసరా పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సభల్లో ఊదరగొట్టినా తీరా వెంటనే నగదు జమకాకపోవడంతో మహిళలు విమర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అసలు నగదు ఖాతాల్లో వస్తాయో లేదో అర్థంకావడం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరికి అంది, మరికొందరికి రాకపోవడంపై అధికారులను డ్వాక్రా మహిళలు నిలదీస్తున్నారు. మాకెందుకు ఆలస్యంగా జమ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో డీఆర్డీఏ అధికారులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆసరా పథకం జిల్లా డీపీఎం కుమారస్వామిని అడగగా ఇప్పటికే 60 శాతం మంది డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో నగదు జమైందని చెప్పారు. మిగిలిన వారికి మూడు రోజుల్లో వచ్చేస్తుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్