Visakhapatnam: అమెరికాలో ఉన్నా.. ఇక్కడ ఓట్లా?
దక్షిణ నియోజకవర్గ పరిధి 148 పోలింగ్ కేంద్రం ఓటరు జాబితాలో తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు.
వన్టౌన్, న్యూస్టుడే: దక్షిణ నియోజకవర్గ పరిధి 148 పోలింగ్ కేంద్రం ఓటరు జాబితాలో తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు. చనిపోయిన, శాశ్వత వలసదారుల ఓట్లను తొలగించలేదు. రెల్లివీధి, ఆశీపాపవీధి, ఏవీఎన్ కళాశాల ప్రాంతాలు ఈ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తాయి.
- ఓటరు జాబితాలో క్రమ సంఖ్య 185, 186, 188లో ముగ్గురు అమెరికాలో ఉంటున్నారు. అయినప్పటికీ వీరి ఓట్లు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఐలకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం చివర 999 సీరియల్తో ఓటు హక్కు కల్పిస్తుంది. అయితే ఇక్కడ వారి పేర్లను సాధారణ ఓటర్ల మాదిరిగానే ముద్రించారు. శాశ్వత వలసదారులైన 122 మంది పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయి.
- 38వ వార్డు కనకమహాలక్ష్మి (బురుజుపేట) ప్రాంతంలో నివాసం ఉండే వీర్రాజు (వరుస సంఖ్య-401) ఓటు 36వ వార్డులోని రెల్లివీధి పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది. ఆయన ఓటు వేయాలంటే బురుజుపేట నుంచి రెల్లివీధికి వెళ్లాల్సి ఉంటుంది.
- 148 పోలింగ్ కేంద్రంలో 867 మంది ఓటర్లు ఉండగా, అందులో 44 మంది మృతులు, 122 మంది శాశ్వత వలసదారులు, డూప్లికేట్ ఓట్లు మూడు, డోర్ నెంబరు తప్పు-1 వెరసి 170 పొరపాట్లు దొర్లాయి. ఆయా జాబితాలను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
పేర్లు... తప్పుల తడక!!
మధురవాడ, న్యూస్టుడే: మధురవాడ పరిధిలోని 281, 282 బూత్ల పరిధిలోని జాబితాల్లో ఓటరు పేర్లు తప్పుల తడకలుగా ముద్రించారు. ఇసుకపల్లికి బదులుగా యిసుక్పఅలీ అని, ఇందుజాశ్వేతబిందు లంకలపల్లికి ఇందుజా శవేతా బిందు లంకలపఅలీ, మాణిక్యంనాయుడు ఉలూరికి మణిక్యామ్నైడూ ఉలురీ అని, ఇందిరాకుమారి తమ్మిశెట్టికి ఇందిరాకుమారి ఠమ్మీసేతీ, విజయాంబిక పేరు వద్ద వీజయమ్బికా, నాగ హిరణ్మయికి నాగహ్యామ్నాయా తదితర పేర్లతో తప్పులు దర్శనమిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల