logo

రెండు కిలోల బంగారు చీరతో అలంకరణ

లలితానగర్‌ కుర్తాళ సిద్ధేశ్వర లలితా పీఠంలో అమృతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

Published : 23 Feb 2024 02:34 IST

అమ్మవారికి చీరను సమర్పిస్తున్న జగద్గురు సిద్ధేశ్వరానందన భారతీ స్వామి

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: లలితానగర్‌ కుర్తాళ సిద్ధేశ్వర లలితా పీఠంలో అమృతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. లలితా పీఠం 75వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం లలితా కామేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 2 కిలోల బంగారంతో తయారు చేసిన చీరతో అలంకరించారు. కుర్తాళం పీఠాధిపతి జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అమ్మవారికి బంగారు చీరను వేశారు. లలితా కామేశ్వర విగ్రహాలను పట్టు వస్త్రాలు, ఆభరణాలు,  వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో కుర్తాళం పురోహితులు రమేష్‌ శర్మ, శక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి, పీఠం మేనేజర్‌ మన్నవ కృష్ణసేన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని