logo

ఉత్సాహంగా వీడ్కోలు వేడుక

భీమబోయినపాలెం కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో గురువారం పది విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Published : 23 Feb 2024 02:40 IST

బాలికల జానపద నృత్యం

మాకవరపాలెం, న్యూస్‌టుడే: భీమబోయినపాలెం కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో గురువారం పది విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అతిథిగా హాజరైన ఎంపీపీ సత్యనారాయణ కÛస్తూర్బాగాంధీ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఈఓ మూర్తి మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో బాలికలు చేసిన జానపద, సినిమా పాటల డ్యాన్సులకు విద్యార్థులు చప్పట్లు కొడుతూ, కేరింతలతో సరదాగా గడిపారు. పాఠశాల ఛైర్మన్‌ నారాయణమూర్తి, నాయకులు భద్రాచలం, బుచ్చిబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని