ఎలమంచిలిలో పైవంతెన ప్రారంభం
ఎలమంచిలి పట్టణంలో 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయిన రైల్వే పైవంతెన ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ప్రధాన సమస్య పరిష్కారమైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.
పైవంతెన ప్రారంభిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజా, చిత్రంలో ఎమ్మెల్యే రమణమూర్తిరాజు, ఛైర్పర్సన్ రమాకుమారి, సుకుమార్వర్మ తదితరులు
ఎలమంచిలి న్యూస్టుడే: ఎలమంచిలి పట్టణంలో 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయిన రైల్వే పైవంతెన ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ప్రధాన సమస్య పరిష్కారమైందని రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన పైవంతెనను ఆయన గురువారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. శిలాఫలకం ఆవిష్కరించారు. పదిహేనేళ్లగా ఈ వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. రమణమూర్తిరాజు (కన్నబాబు) ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే దీన్ని అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. వైకాపా పాలనా కాలం ముగిసిపోతున్నా వంతెన అందుబాటులోకి రాకపోవడంపై ‘ఈనాడు’లో ఈ నెల 8న ‘15 ఏళ్లలో పైవంతెన కట్టలేరా?’ అంటూ కన్నబాబును సూటిగా ప్రశ్నిస్తూ కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వంతెన పనులు చేపట్టిన ముగ్గురు గుత్తేదారులు వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. చివరకు వేరే నిర్మాణ సంస్థను ఒప్పించి పనులు ప్రారంభించామని చెప్పారు. గేటు పడితే అరగంటకు పైనే వాహనాలు నిలిచిపోయేవని, తాను కూడా చాలాసార్లు ఇబ్బందులు పడ్డానని గుర్తుచేసుకున్నారు. వంతెనపై వేసిన కాంక్రీట్ మరో కొన్ని రోజులు తడపాల్సి ఉన్నందున ఈ నెల 29 ఉదయం నుంచి అన్ని వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ఏషియన్ పెయింట్స్ సహకారంతో ఎలమంచిలి పెంజెరువును రూ. 15 కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పిళ్లా రమాకుమారి మాట్లాడుతూ ఎలమంచిలిలో రెండు పార్కులు నిర్మిస్తున్నామన్నారు. వీటికి తులసీ, సత్యంరాజు పార్కులుగా పేర్లు పెట్టామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ఈ కె.కాంతిమతి, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, ఎంపీపీ బోదెపు గోవింద్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొద్దపు ఎర్రయ్యదొర, డీసీసీబీ మాజీ ఛైర్మన్ సుకుమార్ వర్మ, కర్రి శివ, మున్సిపల్ కౌన్సిలర్లు సంధ్య, మరిడేశ్వరరావు, వెంకట్, కిరణ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల