గొంపలో వైకాపా నేతల బరితెగింపు
ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. రూ.15.5 లక్షలకు గ్రామకంఠం స్థలానికి వేలం ఖరారు చేశారు.
గ్రామకంఠం స్థలానికి బహిరంగ వేలం
గ్రామకంఠంలోని వాటర్ ట్యాంకు, మోటారు షెడ్డు
రావికమతం (చోడవరం), న్యూస్టుడే: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. రూ.15.5 లక్షలకు గ్రామకంఠం స్థలానికి వేలం ఖరారు చేశారు. ఇదేదో రెవెన్యూ అధికారులు నిర్వహించిన వేలం కాదు. రావికమతం మండలం గొంపలో వైకాపాకు చెందిన నాయకులు ఆక్రమించి మరీ వేసిన బహిరంగ వేలం. పిల్లా సత్యారావు రూ.15.50 లక్షలకు పాడుకుని ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే స్థలంలోని తుప్పలను తొలగించి నిర్మాణాలు చేపట్టేందుకు ఇసుక తెప్పించారు. ఇంత జరుగుతున్నా.. గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
- గొంప ఒకప్పటి నియోజకవర్గ కేంద్రం.. ఈ గ్రామం 1977 వరకు నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం జనాభా 3,200 వరకు ఉంది. ఇక్కడ వైకాపా వారిదే ఆధిపత్యం. సర్పంచిగా వైకాపాకు చెందిన కంట్రెడ్డి గోవింద ఉన్నారు. సర్వే నంబరు 61లోని గ్రామకంఠం స్థలంలో శిథిలావస్థకు చేరిన పాత పంచాయతీ భవనాన్ని తొలగించి గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించి ఇటీవల ప్రారంభించారు. సచివాలయ భవనాన్ని ఆనుకుని సర్వే నంబరు.61లో ఆరు సెంట్ల వరకు గ్రామ కంఠం స్థలం ఉంది. ఇందులోని కొంత భాగంలో 2018 వరకు నేల బావి ఉండేది. ఆరోగ్య ఉప కేంద్రం అద్దె ఇంట్లో కొనసాగేది. 2008లో అప్పటి సర్పంచి అధికారి రాజు ఆరోగ్య ఉప కేంద్ర భవనం బావి స్థలంలో నిర్మించాలని పంచాయతీ తీర్మానం చేయించారు. 2014-19 మధ్య సర్పంచిగా వ్యవహరించిన బొర్రా శ్రీను, అప్పటి పాలకవర్గం ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం కోసం నేల బావిని పూడ్పించారు.
- వైకాపా అధికారంలోకి వచ్చాక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. గ్రామకంఠం తమదంటూ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పిల్లా, తోట కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని ఆక్రమించారు. రెండు కుటుంబాల్లోని ఎవరో ఒకరికే ఆ స్థలం దఖలు పడేలా, విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును రెండు వాటాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. ఇటీవల పిల్లా సత్యారావు, గోవింద, తోట సునీల్, రామారావు సమక్షంలో వేలం నిర్వహించగా.. సత్యారావు రూ.15.5 లక్షలకు వేలం పాడి ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నారు. గ్రామకంఠాన్ని ఆక్రమించి వేలం నిర్వహించిన వీరంతా సర్పంచి కంట్రెడ్డి గోవింద వర్గీయులు. సర్పంచి అండతోనే ఇదంతా జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
- పంచాయతీ కార్యదర్శి సతీష్ను వివరణ కోరగా.. ‘సర్వే నంబరు 61లోది గ్రామకంఠమే. దీనికి వేలం పాట నిర్వహించినట్లు తెలీదు. ఆ స్థలం ఎవరి పరం కాకుండా తహసీల్దారు దృష్టికి తీసుకెళ్తామ’ని చెప్పారు. వీఆర్వో డొంకా అప్పారావు మాట్లాడుతూ.. గ్రామకంఠం స్థలానికి వేలం నిర్వహించినట్లు అందిన సమాచారంపై గ్రామస్థులను ఆరా తీయగా.. వాస్తవమేనని తేలిందన్నారు.
- సర్పంచి గోవింద దృష్టికి తీసుకెళ్లగా.. వేలం విషయం తనకు తెలియదని, వారు తన వర్గీయులు కాదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?