ఎన్నాళ్లకెన్నాళ్లకు..!!
క్రికెట్ అభిమానులకు శుభవార్త. రెండు ఐపీˆఎల్ మ్యాచ్లకు నగరం వేదికకానుంది. గురువారం ‘ఐపీఎల్ 2024’ షెడ్యూలును నిర్వాహకులు ప్రకటించారు.
విశాఖకు రెండు ఐపీఎల్ మ్యాచ్లు కేటాయింపు
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: క్రికెట్ అభిమానులకు శుభవార్త. రెండు ఐపీˆఎల్ మ్యాచ్లకు నగరం వేదికకానుంది. గురువారం ‘ఐపీఎల్ 2024’ షెడ్యూలును నిర్వాహకులు ప్రకటించారు. పీఎంపాలెంలో ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 31న దిల్లీ క్యాపిటల్స్ -చెన్నై సూపర్కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 3న దిల్లీ క్యాపిటల్స్- కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఆడనున్నాయి. విశాఖ క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ మ్యాచ్లు తిలకించి నాలుగేళ్ల అవుతుంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ షెడ్యూలు విడుదలవడం ... అందులో విశాఖకు మ్యాచ్లు కేటాయించకపోవడంతో నిరాశలో మునిగిపోయేవారు. ఈసారి రెండు మ్యాచ్లు విశాఖలో జరగనుండటంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. అభిమాన క్రికెటర్లను తిలకించేందుకు, బౌండరీలు, సిక్సర్లు బాదే వారి ఆటను ఆస్వాదించేందుకు క్రికెట్ ప్రేమికులు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో విశాఖకు రెండు మ్యాచ్లు కేటాయించడంతో దిల్లీ క్యాపిటల్స్ కోఓనర్స్ కిరణ్కుమార్, జిందాల్కు ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్చంద్రారెడ్డి, ఎస్.ఆర్. గోపీనాథరెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్లు జరిగాయి. భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ తిలకించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు కోలాహలం నెలకొంది. గత ఏడాది నవంబరులో జరిగిన భారత్- ఆస్ట్రేలియా టీ-20 కూడా అభిమానులను ఉర్రూతలూగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.