సుందరీకరణ గండం!
వైకాపా ప్రభుత్వ తీరు జీవవైవిధ్యానికే ముప్పు తెస్తోంది. విశాఖ బీచ్లలో సుందరీకరణ పనులు అరుదైన తాబేళ్ల జాతికి శాపంగా మారాయి.
తీరంలో ఇష్టారాజ్యంగా పనులు
తాబేళ్ల రాకకు అడ్డంకులు
ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపునకు తీరంలో వినియోగించిన యంత్రం
ఈనాడు, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వ తీరు జీవవైవిధ్యానికే ముప్పు తెస్తోంది. విశాఖ బీచ్లలో సుందరీకరణ పనులు అరుదైన తాబేళ్ల జాతికి శాపంగా మారాయి. వాటి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆలివ్రిడ్లే, గ్రీన్ టర్టిల్, హాక్స్బిల్ జాతికి చెందిన తాబేళ్లు విశాఖ తీరానికి అధికంగా వస్తుంటాయి. ఇవి మెక్సికన్ తీరాల నుంచి బంగాళాఖాతం మీదుగా ప్రయాణించే సమయంలో తీరంలో తెల్లటి ఏటవాలు ఇసుక తిన్నెలను ఇష్టపడతాయి. వాటికి సహజమైన గూడుగా భావిస్తాయి.
ఏటా జనవరి నుంచి మే వరకు నగర పరిధిలోని ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, తొట్లకొండ, పెదనాగమయ్యపాలెం, సాగర్నగర్, రుషికొండ, ముత్యాలమ్మపాలెం పరిసరాల్లో గుడ్లు పెడతాయి. పర్యావరణానికి ఈ తాబేళ్లు ఎంతో మేలు చేస్తాయి. అందుకే అటవీశాఖ అధికారులు వీటిని సేకరించి.. పిల్లలు పుట్టిన తరువాత సాగరంలో విడిచిపెడతారు. అయితే...కొంతకాలంగా సేకరిస్తున్న గుడ్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది.
అలా తొలగించారు..
‘జి-20 సన్నాహక సదస్సు’ సమయంలో సుందరీకరణ పేరుతో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక తిన్నెలను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. పలు చోట్ల అటవీశాఖ నిబంధనలను అతిక్రమించారు. తాబేళ్లకు ఆవాసంగా ఉండే చిన్నపాటి పొదలు, ఆకు మొక్కలు, చెట్లను కూకటి వేళ్లతో తొలగించారు. కొన్నిచోట్ల జేసీబీలను బీచ్లోకి తీసుకొచ్చి మరీ తొక్కించారు. అభివృద్ధి పనులంటూ మంగమారిపేట, సాగర్నగర్, తెన్నేటిపార్క్, అప్పూఘర్, భీమిలి వద్ద సిమెంటు నిర్మాణాలు చేపట్టారు. ఎక్కడికక్కడ విద్యుత్తు స్తంభాలు, సిమెంటు బల్లలు నిర్మించేశారు. తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతకు కొత్తగా తీసుకొచ్చిన భారీ యంత్రాలతో ఇసుక తిన్నెల్లో పనులు చేయడంతో తాబేళ్ల గూళ్ల నాశనానికి కారణం అవుతున్నాయి.
విద్యుత్తు దీపాలతో..
తాబేళ్లు సాధారణంగా రాత్రిళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. మిరిమిట్లు గొలిపే విద్యుత్తు వెలుగులు ఉంటే వెనక్కి వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ‘జి-20’, బీచ్ సుందరీకరణ పనుల్లో తీరమంతా ఎక్కడికక్కడ దీపాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చే చోట జీవీఎంసీ అధికారులు కొత్తగా పదుల సంఖ్యలో స్తంభాలు వేసి మరీ దీపాలు అమర్చారు. రుషికొండ వద్ద తవ్విన గ్రావెల్ను పలు చోట్ల సముద్ర తీరంలో డంపు చేశారు. ఇది సముద్రం వైపు జారి...ఇసుక తిన్నెల సహజ స్థితి చెల్లాచెదురయింది. అనువైన ఇసుక తిన్నెలు కనిపించక తాబేళ్ల రాక తగ్గిపోయింది. ‘గతంలో ఏర్పాటు చేసిన కొన్ని విద్యుత్తు స్తంభాలను ఇప్పటికే తొలగించాం. సాగర్నగర్ మరికొన్ని చోట్ల బీచ్ వైపు వెలుగుతున్న దీపాలను నిలిపేశాం. తాబేళ్ల ఆవాసానికి వీలుగా 25 ఎకరాల్లో కొత్తగా మొక్కలు నాటి పెంచుతున్నాం’ అని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట