AP News: ఇంటర్ బోర్డు వింతలు ఇన్నిన్ని కాదయా!
దివ్యాంగులు కనిపిస్తే అయ్యో పాపం అంటూ చేతనైన సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇంటర్బోర్డు అధికారులు మాత్రం దయలేకుండా దూరంగా పరీక్ష కేంద్రాలను కేటాయించిన ఉదంతం అచ్యుతాపురంలో వెలుగుచూసింది.
ముడుపులివ్వలేదని ముప్పుతిప్పలు
అచ్యుతాపురం, న్యూస్టుడే
దివ్యాంగులు కనిపిస్తే అయ్యో పాపం అంటూ చేతనైన సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇంటర్బోర్డు అధికారులు మాత్రం దయలేకుండా దూరంగా పరీక్ష కేంద్రాలను కేటాయించిన ఉదంతం అచ్యుతాపురంలో వెలుగుచూసింది.
జగన్ ప్రభుత్వంలో వైకాపా నాయకులతోపాటు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే చందంగా మాట వినని కళాశాల యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నించారు. తమ మాట వినకపోతే పరిస్థితులు ఈవిధంగానే ఉంటాయని మిగిలిన కళాశాలలకు తెలిసేలా దివ్యాంగులను సైతం దూర కేంద్రాలకు తరలించారు. పరీక్షల సమయంలో పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు ఇప్పుడు పరీక్షా కేంద్రాల గురించి కలవరం చెందుతున్నారు.
అచ్యుతాపురంలో నాలుగు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఓ కళాశాలలో 302 మంది ఇంటర్ చదువుతున్నారు. వీరిలో 200 మంది బాలికలు ఉండగా అందులో 15 మంది అంధ, చెవిటి, మూగ, శారీరక వైకల్యంతో ఉన్న విద్యార్థులు. మిగిలిన మూడు కళాశాలల్లో 900 మంది విద్యార్థులు. వీరందరికీ స్థానికంగానే పరీక్ష కేంద్రాన్ని ఇంటర్ అధికారులు కేటాయించారు. దివ్యాంగ విద్యార్థులున్న కళాశాల వారికి మాత్రం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొక్కిరాపల్లి, తాళ్లపాలెం గురుకుల పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. తమకు దూరంగా ఉన్న కేంద్రాలను కేటాయించడంపై దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అధికారులకు ముడుపులు ఇవ్వలేదనే కారణాలతోనే కళాశాల యాజమాన్యంపై పగబట్టి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ కళాశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రైల్వేగేట్లు దాటి పరీక్షా కేంద్రాలకు ఏవిధంగా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ అధికారుల తీరుపై స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
దీనిపై డీఐఈఓ సుజాతను వివరణ కోరగా ఇంటర్ విద్యార్థుల వివరాలు సేకరించి బోర్డుకు పంపించామని, తమ ప్రమేయం లేకుండా కేంద్రాలు కేటాయింపు జరిగిందన్నారు. కేంద్రాల కేటాయింపు తన పరిధిలోని అంశం కాదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్