చోరీ చేసిన సొమ్ముతో జల్సాలు
నగర పరిధిలో పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడు కె.శ్రీనివాస్ అలియాస్ కృష్ణమోహన్ను అరెస్టు చేసినట్లు డి.సి.పి. (క్రైమ్) వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : నగర పరిధిలో పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడు కె.శ్రీనివాస్ అలియాస్ కృష్ణమోహన్ను అరెస్టు చేసినట్లు డి.సి.పి. (క్రైమ్) వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం పోలీసు సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మధురానగర్లోని కీర్తన రెసిడెన్సీకి చెందిన సూర్యప్రసాద్ ఇంట్లో లేనప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి అందులో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించారు. పాత నేరస్థుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్ దరి తిరుమల టవర్స్లో నివాసముంటున్న పాత నేరస్థుడు కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కృష్ణమోహన్ అలియాస్ క్రిష్, అలియాస్ కార్తిక్ను విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు దరి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీటెక్ వరకు చదివి సినిమాలపై వ్యామోహంతో హైదరాబాద్ వెళ్లి కొన్నాళ్లు సినీ పరిశ్రమలో పనిచేశాడు. అక్కడ వ్యసనాలకు బానిసగా మారి ఇళ్లల్లో దొంగతనాలు మొదలుపెట్టాడు. చోరీలు చేస్తూ ఆ సొత్తును అమ్మగా వచ్చిన డబ్బులతో గోవా, బెంగళూరు, మైసూర్ వెళ్లి అక్కడ జల్సాలు చేస్తూ గుర్రపు స్వారీ రేస్లకు ఉపయోగించేవాడు.
నిందితుడు పగలు రెక్కీ నిర్వహించి, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కృష్ణమోహన్పై ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మొత్తం 144 కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడి నుంచి రూ.12.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 197 గ్రాముల బంగారు ఆభరణాలను మైసూర్లో అమ్మినట్లు నిందితుడు అంగీకరించాడు. కార్యక్రమంలో ఎ.డి.సి.పి. (క్రైమ్) గంగాధరం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్