ఓట్ల తొలగింపునకు.. సీఈవో అనుమతి తప్పనిసరి
ఓటరు జాబితా నుంచి ఒక ఓటు తొలగించాలంటే ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అనుమతి లేకుండా తొలగించకూడదని ఆదేశించింది.
పెండింగ్లో 7251 దరఖాస్తులు
తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నుంచి అత్యధికం
వన్టౌన్, న్యూస్టుడే: ఓటరు జాబితా నుంచి ఒక ఓటు తొలగించాలంటే ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అనుమతి లేకుండా తొలగించకూడదని ఆదేశించింది. ఈ మేరకు సీఈఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- గతంలో మాదిరిగా ఎవరో చేసిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఓట్లను తొలగించడం ఇక మీదట కుదరదు. గత నెల 22న జిల్లాలో తుది ఓటరు జాబితాలు విడుదల అయ్యాయి. అప్పటి నుంచి మళ్లీ తొలగింపులు, మార్పులు, చేర్పులకు ఆన్లైన్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 60,437 దరఖాస్తులు రాగా వాటిల్లో 27,060 పరిష్కరించారు.
- ఓటరు జాబితాల సవరణ ప్రారంభమైనప్పటి నుంచి ఓట్ల తొలగింపులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారని ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి 10 మంది వైకాపా నాయకులు ఆయా దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. పశ్చిమ నియోజకవర్గ ఆర్ఓ, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఆదేశాల మేరకు వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వహించకూడదు. వీరితో పాటు మరో 13 మందిపై చర్యలకు సిఫార్సు చేశారు. వీరంతా అయిదేసి ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. వారిపై కేసులు నమోదు చేయకున్నప్పటికీ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు. వీరు సైతం ఎన్నికల విధులకు దూరంగా ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
- తాజా పరిణామాల నేపథ్యంలో ఓటరు నమోదు అధికారులు (ఈఆర్ఓ) కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపులకు సంబంధించి 7251 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.. వీటిలో ఎక్కువగా విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల పరిధిలోనివి ఉన్నాయి. తుది ఆమోదం కోసం వీటిని సీఈఓ కార్యాలయానికి నివేదిస్తున్నారు. నమోదులకు సంబంధించి విశాఖ తూర్పు 3199, భీమునిపట్నం 2644, దక్షిణం 1659, ఉత్తరం 3040, పశ్చిమ 1621, గాజువాక 2792, పెందుర్తి 2076 చొప్పున దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు