సిబ్బంది పెరిగినా.. సేవలు అరకొరే..
ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తమ వైద్యసేవల కోసం నెలకొల్పిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో పూర్తిస్థాయిలో సేవలందట్లేదు. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నా చికిత్స పొందుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు కేజీహెచ్కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తమ వైద్యసేవల కోసం నెలకొల్పిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో పూర్తిస్థాయిలో సేవలందట్లేదు. పెద్ద సంఖ్యలో వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నా చికిత్స పొందుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు కేజీహెచ్కు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.
విమ్స్లో మొత్తం 650 పడకలుండగా 450 వరకు వినియోగించుకునేందుకు అనుమతులున్నాయి. గతంలో 32 మంది వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి డిప్యుటేషన్పై పనిచేసేవారు. క్రమంగా ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని విధంగా జీతాలు పెంచారు. ప్రస్తుతం కీలక విభాగాలన్నింటిలో మొత్తం 57 మంది వైద్యులున్నారు. వీరితోపాటు 212 మంది స్టాఫ్ నర్సులు, 187 మంది పారామెడికల్, ఇతర విభాగాల సిబ్బందితో కలసి మొత్తం 600 మంది పనిచేస్తున్నారు. వారందరికీ జీతాలకు నెలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చవుతోంది. కానీ బెడ్ ఆక్యుపెన్సీ 16 శాతానికే పరిమితమైంది. 150 నుంచి 180 పడకల వరకు మాత్రమే నిండుతున్నాయి. ఇదే విషయమై ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు ఆసుపత్రి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. కానీ దీనికిగల కారణాలు, పరిష్కారాలపై ఆసుపత్రి అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
జూనియర్లే అధికం..
సిబ్బంది పెరిగినా.. సేవలు అరకొరే..సుపత్రిలో వైద్యుల నియామకాలను స్థానికంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా చేపడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.1.60 లక్షలు, జనరల్ మెడిసిన్కు చెందినవారికి రూ.1.10 లక్షలు చెల్లిస్తున్నారు. జీతాలు పెంచడంతో ఎక్కువ మంది ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నా మెరుగైన సేవలపై దృష్టి పెట్టడం లేదు. మరికొందరు ఇక్కడ పనిచేస్తూనే ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఆర్థోపెడిక్ మినహా అన్ని విభాగాల్లో జూనియర్లే వైద్యులుగా ఉన్నారు. పల్మనాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్ మినహా మిగిలిన విభాగాల్లో వైద్యులు బాధ్యతగా పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేరుగా ఈ ప్రక్రియ చేపడితే నైపుణ్యమున్నవారు నియమితులయ్యే అవకాశముంది.
అనుభవం లేని వారికి బాధ్యతలు
రోగులకు సంబంధించిన కేస్ షీట్లలో వివరాల నమోదు, డ్రగ్ స్టోర్, ల్యాబ్ నిర్వహణలోనూ లోపాలు వెలుగుచూస్తున్నాయి. అనుభవజ్ఞులను పక్కన పెట్టి కొత్తగా విధుల్లో చేరిన, తక్కువ వయసుగల నర్సింగ్ సిబ్బందికి ఫ్లోర్ ఇంఛార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వారికి అవగాహన లేకపోవడంతో తోటి సిబ్బందికి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చెప్పినా ఎవరూ వినిపించుకోవట్లేదు. అనుభవమున్నవారికి బాధ్యతలు అప్పగిస్తే నిర్వహణ మెరుగు పడుతుందని తెలిసినా ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఇదే విషయమై ఇటీవల తనిఖీలకు వచ్చిన ఎన్ఏబీహెచ్ బృందం సైతం ప్రశ్నించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్