Rushikonda: రుషికొండపై జగన్నాటకం..!
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో రుషికొండ మీద నిర్మించిన రాజసౌధాన్ని ఎన్నికల ముందు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటకశాఖ ఇంతకుమునుపెన్నడూ ఖర్చు చేయని విధంగా ఈ ఒక్క చోటే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్ను నిర్మించారు.
నిర్మాణాలకే రూ.450 కోట్ల ఖర్చు
సీఎం తాత్కాలిక వసతిగా గతంలో గుర్తింపు
ఆకస్మికంగా ప్రారంభానికి చర్యలు
మొదట ఒక పేరు.. ఆ తర్వాత మరో పేరు
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో రుషికొండ మీద నిర్మించిన రాజసౌధాన్ని ఎన్నికల ముందు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటకశాఖ ఇంతకుమునుపెన్నడూ ఖర్చు చేయని విధంగా ఈ ఒక్క చోటే దాదాపు రూ.450 కోట్లు ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్ను నిర్మించారు.
ఈనాడు, విశాఖపట్నం: రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రిసార్టు పేరుతో తీర ప్రాంత నియంత్రణ జోన్ (సీఆర్జడ్) అనుమతుల తీసుకున్న ఏపీటీడీసీ గురువారం పర్యాటకశాఖ మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించనుంది. ఆది నుంచి అత్యంత వివాదాస్పదమైన ఈ ప్రాజెక్టును ఏవిధంగా కొనసాగిస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి అవసరాలకు వీలుగా నిర్మించిన భవనాలను అందుకోసమే ఉంచుతారా? మరే ఇతర అవసరాలకైనా వినియోగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం తాత్కాలిక వసతికి అనువుగా ఉంటుందని గతంలో గుర్తించడం గమనార్హం.
త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ‘రిసార్టు’ కోసమే ఈ నిర్మాణాలనే భావన కలిగేలా ఆకస్మికంగా ప్రారంభిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరువాత అధికార పార్టీలో కీలక నేతలకు లీజుకు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. మొదట ఈ ప్రాజెక్టుకు సంబంధించి ‘సమీకృత పర్యాటక సముదాయం’ పేరుతో 2021 జనవరిలో ఏపీటీడీసీ ఆసక్తి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతిపాదనలు(ఆర్ఎఫ్పీ)ఆహ్వానించింది. 65 ఎకరాల్లో విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మించేలా రెండు దశల్లో రూ.230 కోట్లతో పనులు చేపట్టాలని పేర్కొంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఏడు నక్షత్రాల హోటల్ నిర్మిస్తున్నట్లు అప్పటి పర్యాటకశాఖ మంత్రి ఊదరకొట్టారు. ఆ తర్వాత 2021 జులైలో రిసార్టు పునరుద్ధరణ (రీడెవలప్మెంట్ ఆప్ రిసార్టు ఎట్ రుషికొండ) ప్రాజెక్టుగా మార్చి పనులు మొదలెట్టారు.
అనుమతులు ఒకలా.. పనులు మరోలా: పునరుద్ధరణ పనులకు ఏపీటీడీసీ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి 9.88 ఎకరాలకు తీర ప్రాంత జోన్ (సీఆర్జడ్) అనుమతి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భవన నిర్మాణాల (బిల్డింగ్) ప్లాన్ కోసం 65 ఎకరాలకు అనుమతి కోరడం అప్పట్లో వివాదాస్పదమైంది. అనంతరం జీవీఎంసీకి సమర్పించిన ప్లాన్లోని భవనాలకు సంబంధించిన ఆకృతులు పర్యాటక వసతులకు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాలయాలను పోలి కనిపించాయి. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. చివరిగా వేంగి, గజపతి, కళింగ, విజయనగరం బ్లాక్స్ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
మొదటి నుంచి: రుషికొండను అక్రమంగా తవ్వేసిన తీరును మొదటి నుంచి పర్యావరణవేత్తలు తప్పుపట్టారు. చివరికి హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో కేసులు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు సభ్యుల నిపుణుల కమిటీ రుషికొండ మీద సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు వాస్తవమేనని అప్పట్లో తేల్చింది. ఆ తర్వాత హైకోర్టు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్)ను పరిశీలనకు ఆదేశించింది. ఎంవోఈఎఫ్ సైతం నిపుణుల కమిటీతో పరిశీలించింది. దీనికి సంబంధించి తుది తీర్పు త్వరలో రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేనకు ‘దక్షిణం’ జై!
[ 03-05-2024]
యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు దక్కాలంటే వైకాపా ప్రభుత్వం కూలిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పేర్కొన్నారు. -
జగమొండి.. పథకాలకు గండి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పించిన జగన్ వారిని ఓటు బ్యాంకుగానే చూశారు. -
నేడు బాలకృష్ణ రోడ్షో
[ 03-05-2024]
సినీ నటుడు బాలకృష్ణ రోడ్షో శుక్రవారం సాయంత్రం నగరంలో జరగనుందని తెదేపా వర్గాలు తెలిపాయి. -
ఆలయ భూమి హాంఫట్
[ 03-05-2024]
గ్రామదేవతకు భక్తులు అందించిన భూమిని నాయకులతో కలిసి ఒకరు కారుచౌకగా కొట్టేశారు. -
మౌలిక వసతులతో ఇళ్లిస్తాం: అయ్యన్న
[ 03-05-2024]
కూటమి విజయం ఖాయం. అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే నర్సీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
జగన్కు యూఎల్సీ ఝలక్..!
[ 03-05-2024]
నగరంలోని యూఎల్సీ (పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం) ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూముల్లో వెలిసిన ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నీరుగారి పోయింది. -
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం
[ 03-05-2024]
కూటమితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
అధ్వాన రహదారులతో అనకాపల్లి జిల్లా
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
కూటమితో బీసీలకు రాజ్యాధికారం: శ్రీభరత్
[ 03-05-2024]
ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపాను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెదేపా కూటమితోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టండి: గంటా
[ 03-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో దుర్మార్గ వైకాపా సర్కారును తరిమికొట్టి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక అవసరం అందరిపైన ఉందని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. -
నేటి నుంచి నిజరూప దర్శనం టికెట్ల విక్రయం
[ 03-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : గణబాబు
[ 03-05-2024]
ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
పట్టాదారు పుస్తకం మీద సీఎం బొమ్మ ఉంటే ఏం?: బొత్స
[ 03-05-2024]
రైతుల పట్టాదారు పాసు పుస్తకం మీద సీఎం చిత్రం ఉంటే అది చట్టపరంగా చెల్లకపోవడమంటూ ఏమీ లేదు కదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ భూ హక్కుదారులను అపహాస్యం చేశారు. -
అవయవదానంతో దాతృత్వం చాటారు!
[ 03-05-2024]
చనిపోయిన వ్యక్తి అవయవదానానికి ముందుకు వచ్చి ఆ కుటుంబ సభ్యులు దాతృత్వం చాటారు. -
నకిలీ నోట్లు, బంగారం ముఠా గుట్టురట్టు
[ 03-05-2024]
తక్కువ కాలంలో డబ్బు, బంగారం సంపాదించాలని ఆశపడే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు, బంగారంతో మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేసినట్లు మధురవాడ ఏసీపీ గురువారం తెలిపారు. -
‘సిద్ధం’ తాయిలాల టోకెన్లకు ఘర్షణ
[ 03-05-2024]
విశాఖ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ సిద్ధం సభకు సిద్ధం చేసిన టోకెన్లపై ఆ పార్టీలోనే ఇద్దరు నాయకులు తీవ్రంగా ఘర్షణ పడటంతో పాటు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
తాజా వార్తలు (Latest News)
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM