‘ఆడ’తావెందుకన్నారు!!.. ఇప్పుడు వారే మెచ్చుకుంటున్నారు
క్రికెట్పై ఆసక్తితో బ్యాటర్గా అడుగుపెట్టి బౌలర్గా మారింది. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన తక్కువ సమయంలోనే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకుంది.
నాన్న కల సాకారమే ధ్యేయం
క్రికెటర్ షబ్నమ్
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం : క్రికెట్పై ఆసక్తితో బ్యాటర్గా అడుగుపెట్టి బౌలర్గా మారింది. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన తక్కువ సమయంలోనే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకుంది. పదిహేనేళ్లకే మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోనూ అవకాశం దక్కించుకుంది. నాన్న కలనే.. తన కలగా చేసుకుని ముందుకు సాగుతోంది విశాఖకు చెందిన పదహారేళ్ల షబ్నమ్. తన విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే.
6 నుంచి 8 గంటల సాధన..
అమ్మ ఈశ్వరమ్మ, నాన్న ఎండీ షకీల్ నేవీలో పనిచేస్తుంటారు. నాన్న క్రికెటర్. నేనూ ఆడతానని చెప్పడంతో ఎనిమిదేళ్లకే అకాడమీలో చేర్చారు. అప్పట్లో సదుపాయాలు లేకపోవడంతో దేశం తరఫున ఆడలేకపోయానని నాన్న ఇప్పటికీ చెబుతుంటారు. చెల్లి షాజహాన్ క్రికెటరే. అండర్-15 ఆడుతోంది. 11 ఏళ్ల వయసులో ప్రాక్టీస్లో భాగంగా కిందపడ్డా. గంట పాటు స్పృహలేదు. సమస్య లేదని వైద్యులు చెప్పడంతో అమ్మ, నాన్న ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల తర్వాత యథావిధిగా ప్రాక్టీస్కు వెళ్లిపోయా. ఫిట్నెస్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ఉదయం 04.30కే శిక్షణ ప్రారంభిస్తా. ప్రాక్టీస్ కోసం సాయంత్రం పీఎం పాలెంలోని క్రికెట్ మైదానానికి వెళ్తా. మ్యాచ్లుంటే రోజుకు 6 నుంచి 8 గంటలు సాధన చేస్తా. ఒక్కోసారి బస్సులు, ఆటోలు దొరక్క ఇంటికొచ్చేసరికి ఆలస్యమయ్యేది. కొద్దిరోజులుగా హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటున్నా.
జాతీయజట్టులో చోటు..
2021లో ఏపీ జట్టుకు, తర్వాత ఏడాదిలోనే ఇండియా-బి జట్టుకు ఎంపికయ్యా. గతేడాది అండర్-19 ప్రపంచ కప్లో జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించా. డబ్ల్యూపీఎల్-1 సమయంలో గుజరాత్ గెయింట్స్ వేలంలో రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఇటీవల ప్రారంభమైన రెండో సీజన్కు గత జట్టులో 18 మందికి గాను ఏడుగురిని మాత్రమే రిటైన్ చేసుకోగా.. నేనొకదాన్ని. తక్కువ వయసులో డబ్ల్యూపీఎల్కు ఎంపికైనవారిలో ఉన్నా. ఇటీవల సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యా.
మరికొందరికి ప్రేరణగా..
క్రికెట్ నేర్చుకుంటానంటే ‘ఆడపిల్లకు ఆటలెందుకని’ బంధువులు అనేవారు. ‘ఆడపిల్లలు.. అబ్బాయిల కంటే ఎందులోనూ తక్కువ కాదని’ నాన్న బదులిచ్చేవారు. మొదట్లో వ్యతిరేకించిన బంధువులు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. నన్ను చూసి మరికొంతమంది అమ్మాయిలకు క్రికెట్ నేర్పిస్తున్నారు. మెలకువలు, శిక్షణ వివరాలు చెప్పాలని అడుగుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. భారత మహిళా క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా నిలిచిపోవాలన్నది లక్ష్యం. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావాలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి