పింఛన్ల పంపిణీలో వైకాపా దొంగాట
సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా బరి తెగిస్తుందనడానికి సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారమే ఉదాహరణ అంటూ విపక్షపార్టీలు మండిపడుతున్నాయి.
గత ఎన్నికల్లోనూ వారం ఆలస్యం
ఇప్పుడేదో అయిపోతోందని గగ్గోలు
ప్రతిపక్షాలపై బురదజల్లే కుట్ర
వన్టౌన్, న్యూస్టుడే
సార్వత్రిక ఎన్నికల వేళ వైకాపా బరి తెగిస్తుందనడానికి సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవహారమే ఉదాహరణ అంటూ విపక్షపార్టీలు మండిపడుతున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల పంపిణీలో జాప్యం చేసి దాన్ని తెదేపాపై తోసేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని వైకాపా ఎత్తుగడ వేసింది. దీనికి అధికార యంత్రాంగం కూడా సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మరుసటి రోజున బ్యాంకులకు సెలవు ఇస్తారు. అదే విధంగా ప్రభుత్వం నిర్వహణ పేరుతో సీఎంఎస్ఎఫ్ను రెండు రోజుల పాటు నిలిపివేస్తుంది. తద్వారా ఏటా ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతుంది. ఈ ఏడాది మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకుల్లో లావాదేవీలు ఉండవు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా ముందు చూపుతో వ్యవహరించలేదు. ఫలితంగా పింఛన్ల పంపిణీ ఒకటి, రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయవచ్చు..
జిల్లాలో 607 గ్రామ/వార్డు సచివాయాలున్నాయి. వీటిలో దాదాపు 4200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 300 మంది లబ్ధిదారులు ఉంటారు. అంటే ఒక్కో ఉద్యోగి 30 మందికి పింఛన్లు ఇస్తే సరిపోతుంది. దీనికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయకుండా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందున ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీ చేపడతామని, లబ్ధిదారులు ఆధార్కార్డు తీసుకుని సచివాలయానికి రావాలంటూ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వృద్ధులు వడదెబ్బ బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారనే అంశం తెరపైకి వస్తోంది.
2019 ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి
విశాఖ జిల్లాలో 1,65,801 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. నగర పరిధిలో 1,38,231 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 27,570 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు పింఛన్లు అందజేసేవారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయవద్దని ఉత్తర్వులు వచ్చాయి. దీంతో పింఛనుదారులకు నగదు ఎలా అందించాలనే అంశంపై సమాలోచనలు సాగుతున్నాయి. ఈ కారణంగా పింఛన్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికి తెదేపా కారణమని వైకాపా విష ప్రచారం చేస్తోంది. అయితే 2019 ఎన్నికల సమయంలోనూ వారం రోజులు ఆలస్యంగా లబ్ధిదారులకు పింఛన్లు అందిన విషయాన్ని తెదేపా గుర్తు చేస్తోంది.
చరవాణులు, బయోమెట్రిక్ పరికరాలు స్వాధీనం
జిల్లాలో దాదాపు 10వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం అందజేసిన చరవాణులు, బయోమెట్రిక్ యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల్లో తలదూర్చకూడదు. ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలి. అయితే వీరిని ఒక కంట కనిపెట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. లేకుంటే వైకాపా అనుకూలంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే