పవన్ పర్యటన 5న
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈనెల 5న అనకాపల్లిలో పర్యటించనున్నారని కూటమి జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 30న వారాహి విజయభేరి జైత్రయాత్ర ప్రారంభించారన్నారు.
మాట్లాడుతున్న కొణతాల రామకృష్ణ, చిత్రంలో పీలా గోవింద్ సత్యనారాయణ, అప్పారావు తదితరులు
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్టుడే: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈనెల 5న అనకాపల్లిలో పర్యటించనున్నారని కూటమి జనసేన అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 30న వారాహి విజయభేరి జైత్రయాత్ర ప్రారంభించారన్నారు. మొదటివిడతగా ఉత్తరాంధ్రలో 4న నెల్లిమర్ల, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ ప్రచార కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనకాపల్లిలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు. కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. అనకాపల్లిలో స్థానిక సమస్యలపై మాట్లాడుతారన్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, స్టీల్ప్లాంట్ చక్కెర కర్మాగారాల మూత తదితర అంశాలపై మాట్లాడుతారన్నారు. ఆర్ఈసీఎస్ను గతంలో మాదిరిగానే కోఆపరేటివ్ సొసైటీలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ భవనాలు ఒకే సముదాయంలో ఉండేలా, జిల్లా కోర్టు నిర్మాణం చేపట్టేలా పవన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ పవన్ సుంకరమెట్ట కూడలి నుంచి నెహ్రూ చౌక్ కూడలి వరకు రోడ్షో ఉంటుందన్నారు. అనంతరం కూడలిలో బహిరంగ సభలో మాట్లాడుతారన్నారు. పార్లమెంట్ బరిలో ఉన్న సీఎం రమేశ్ సైతం ఏర్పాట్లపై చర్చిస్తున్నారన్నారు. భాజపా నాయకుడు పొన్నగంటి అప్పారావు మాట్లాడుతూ పవన్ రోడ్ షో, బహిరంగ సభను భాజపా శ్రేణులతో కలిసి విజయవంతం చేస్తామన్నారు. తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, నారాయణరావు, రాష్ట్ర దళిత సేన, మాల మహానాడు అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న, తాడి రామకృష్ణ, గెంజి సత్యారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి