బటన్ నొక్కి జగన్ను ఇంటికి పంపుదాం
వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని కూటమి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. పేటలో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
సీఎం రమేశ్
సీఎం రమేశ్, అనితను గజమాలతో సత్కరిస్తున్న నాయకులు
పాయకరావుపేట, ఎస్.రాయవరం, న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని కూటమి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. పేటలో మంగళవారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారీఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. దోపిడీ తప్ప అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. వైకాపా నుంచి ఎన్నికైన సభ్యులు ఏ రోజూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పార్లమెంట్లో మాట్లాడలేదని విమర్శించారు. సీఎం జగన్మోహన్రెడ్డి తన ప్రయోజనం కోసమే ప్రధాని మోదీని కలిసేవార[ని ఆరోపించారు. ‘నా ఎస్సీ, నా బీసీ అంటూనే వారిపై వేధింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పినందుకు దళిత మహిళని చూడకుండా అనితపై 23 కేసులు పెట్టారని గుర్తుచేశారు. తాను గెలిచాక అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎక్కడాలేనివిధంగా యువ ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, వారి ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని చక్కెర కర్మాగారాల ఆధునికీకరిస్తామని, లాభాలు ఆర్జించే దిశగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా కనుమరుగువుతుందని వివరించారు. తెలంగాణాలో కేసీఆర్కు పట్టిన గతే జగన్కు పడుతుందని రమేశ్ చెప్పారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు, నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, దేవవరపు రఘు తదితరులు పాల్గొన్నారు.
- ఎస్.రాయవరం తెదేపా, జనసేన, భాజపా నాయకులు సీఎం రమేశ్కు అడ్డురోడ్డులో స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అడ్డురోడ్డు జాతీయ రహదారి ప్రధాన కూడలి వద్ద కూటమి శ్రేణులంతా స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ వినోద్రాజు, మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, మాజీ అధ్యక్షులు నల్లపరాజు వెంకటరాజు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!