అటకెక్కిన ఆధునికీకరణ
రైవాడ కుడి, ఎడమ కాలువల్లో 11 రెగ్యులేటర్లు, 19 స్లూయిస్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. 5 అక్విడెక్ట్లు, 13 కల్వర్టులు నిర్మించడంతో పాటు స్పిల్వే, యాప్రాన్ మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు.
కదలని రైవాడ కాలువ లైనింగ్ పనులు
రైవాడ కాలువలో నిర్మించిన సిమెంట్ లైనింగ్ పగిలిపోయిందిలా..
రైవాడ కుడి, ఎడమ కాలువల్లో 11 రెగ్యులేటర్లు, 19 స్లూయిస్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. 5 అక్విడెక్ట్లు, 13 కల్వర్టులు నిర్మించడంతో పాటు స్పిల్వే, యాప్రాన్ మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. 9.643 కి.మీ సిమెంట్ లైనింగ్ కూడా వేయాలి. ఇవేవీ జరగలేదు.
ఈనాడు, అనకాపల్లి: జిల్లాలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నిధులతో చేపడుతున్న రైవాడ జలాశయం కాలువల ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. అరకొరగా చేసిన పనులు కూడా రూపురేఖలు మారిపోయాయి.. కొన్నేళ్లుగా ప్రతిపాదనల్లోనే మగ్గిన ఈ పనులను 2021లో కార్యరూపంలోకి తీసుకువచ్చారు. రూ.26.46 కోట్ల అంచనాతో కాలువలో సిమెంట్ లైనింగ్, ఇతర నిర్మాణాలు ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. సుమారు రూ.4 కోట్ల మేర పనులు చేసిన తర్వాత బిల్లులు అందకపోవడంతో అసంపూర్తిగానే వదిలేశారు. నెలలు దాటి సంవత్సరాలు గడుస్తున్నా సొమ్ములందే పరిస్థితి లేకపోవడంతో గుత్తేదారు మూటముల్లె సర్దుకుని వెళ్లిపోయారు. దీంతో రైవాడ ఆధునికీకరణ అసంపూర్తిగానే ఆగిపోయింది. నిధుల సమస్యను పరిష్కరించి సాగునీటి భరోసా కల్పించాల్సిన స్థానిక మంత్రి బూడి ముత్యాలనాయుడు రైవాడను వదిలేసి, పెద్దేరును ఉద్ధరిస్తానని ఇటీవల శిలాఫలకం వేశారు. ఆ ప్రాజెక్టుకు సర్కారు సొమ్ములివ్వకపోయినా ఎన్నికల ముందు హడావిడి చేశారు.
దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం మండలాల్లో 15,344 ఎకరాలకు సాగునీటితో పాటు విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రోజూ 50 క్యూసెక్కుల నీటిని రైవాడ నుంచే సరఫరా చేస్తుంటారు. ఈ జలాశాయనికి కుడి, ఎడమ ప్రధాన కాలువలు సుమారు 68 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో కేవలం 18 కి.మీ మాత్రమే గతంలో సిమెంట్ లైనింగ్ పనులు చేశారు. మిగతా అంతా మట్టి కాలువే. ఇందులోనే జైకా నిధులతో ఎడమ ప్రధాన కాలువలో 12 కి.మీ, కుడి ప్రధాన కాలువలో 2 కి.మీ మేర లైనింగ్ పనులు చేసి గట్లను పటిష్ఠపరచాలనుకున్నారు. నిధుల్లేక పనులు పడకేయడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు.
ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి..
ఆయకట్టులో శివారు భూములకు ఎప్పుడూ రైవాడ నుంచి సాగునీరందడం లేదు. మట్టి కాలువలు కావడంతో లీకేజీ సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నారు. జైకా సాయంతో కాలువ ఆధునికీకరణ మొదలుపెట్టారు ఇక సాగునీటి బెంగతీరినట్లే అనుకున్నారు. వారి ఆశలు పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే ఆవిరైపోయాయి. గుత్తేదారు 2022 జనవరి నాటికి రైవాడ ఆధునికీకరణ పూర్తి చేయాల్సి ఉంది. గడువు సమయానికి పనిలో కేవలం 17 శాతం మాత్రమే చేశారు. బిల్లుల సమస్య కారణంగా ఈ పనుల్లో జాప్యం చేస్తూ వచ్చారు. ఈలోగా గుత్తేదారుకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. మరలా మొదలు పెట్టాలంటే నిర్మాణ గడువును (ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ టైమ్) పెంచాల్సి ఉంది. ఈ ఏడాది వరకు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పట్లో రైవాడ పనులు మరలా పట్టాలెక్కడం కష్టమేనని జలవనరుల శాఖ అధికారి ఒకరు చెప్పారు. గడువులోగా చేసిన ఆ కొద్ది పనులు కూడా చెదిరిపోయాయి. అసంపూర్తి పనులకు తోడు ఖరీఫ్ సీజన్లో వాటి మీదుగానే నీటిని విడిచిపెట్టడంతో అడుగున వేసిన కాంక్రీట్ అంతా తేలిపోయింది. కాలువకు రెండువైపు గట్లు కోతకు గురై బలహీనపడ్డాయి. నీరు వదిలినప్పుడు పైకి బాగా కనిపిస్తున్నా.. అడుగు భాగమంతా అధ్వానంగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి