వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్పై కేసు నమోదు
ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు.
చంపేస్తానంటూ బాధితుడికి బెదిరింపులు
చెల్లని చెక్కులు, ఫిర్యాదు లేఖను చూపిస్తున్న బాధితుడు డి.సురేష్
గురుద్వారా, అక్కయ్యపాలెం - న్యూస్టుడే: ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తన వద్ద కొన్ని నెలల కిందట 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్ సుమారు 80 తులాల బంగారం తాకట్టుపెట్టి అప్పుగా రూ.61లక్షలు తీసుకున్నారు. వడ్డీ చెల్లించాలని కోరగా కొన్ని రోజుల క్రితం రూ.10లక్షలు.. రూ.6లక్షల చొప్పున రెండు చెల్లని చెక్లు తనకు ఇచ్చినట్లు బాధితుడు అక్కయ్యపాలెంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చెల్లని చెక్లు ఇచ్చి, అసలుగా తీసుకున్న డబ్బులు ఏమీ చెల్లించకుండానే బంగారం తిరిగి ఇవ్వాలంటూ దొడ్డి కిరణ్ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాడటం మొదలు పెట్టారని, మార్చి 27న తన కార్యాలయానికి వచ్చి కిరణ్ విచక్షణరహితంగా ప్లాస్టిక్ పైపుతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తన వీపుపై తీవ్ర గాయాలవ్వడంతో, అదేరోజు కేజీహెచ్లో తగిలిన గాయాలకు ఎమ్మెల్సీ చేయించుకుని, నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో దొడ్డి కిరణ్ దాడికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. గతంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుని కిరణ్ తిరిగి ఇవ్వలేదని సురేష్ మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేసి చంపుతానంటూ దొడ్డి కిరణ్ బెదిరిస్తున్నారన్నారు. ‘ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించాలి’ అంటూ సురేష్ సీపీకి విన్నవించారు.వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్పై కేసు నమోదు
గురుద్వారా, అక్కయ్యపాలెం - న్యూస్టుడే: ఓ వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడిచేసిన ఘటనలో వైకాపా నాయకుడు దొడ్డి కిరణ్పై విశాఖ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. అక్కయ్యపాలేనికి చెందిన సురేష్ అనే వ్యక్తి 80 అడుగుల రోడ్డులో సీయన్ అనే సంస్థ పేరుతో బంగారంపై రుణాలు ఇస్తుంటారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... తన వద్ద కొన్ని నెలల కిందట 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్ సుమారు 80 తులాల బంగారం తాకట్టుపెట్టి అప్పుగా రూ.61లక్షలు తీసుకున్నారు. వడ్డీ చెల్లించాలని కోరగా కొన్ని రోజుల క్రితం రూ.10లక్షలు.. రూ.6లక్షల చొప్పున రెండు చెల్లని చెక్లు తనకు ఇచ్చినట్లు బాధితుడు అక్కయ్యపాలెంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చెల్లని చెక్లు ఇచ్చి, అసలుగా తీసుకున్న డబ్బులు ఏమీ చెల్లించకుండానే బంగారం తిరిగి ఇవ్వాలంటూ దొడ్డి కిరణ్ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే దురుసుగా మాట్లాడటం మొదలు పెట్టారని, మార్చి 27న తన కార్యాలయానికి వచ్చి కిరణ్ విచక్షణరహితంగా ప్లాస్టిక్ పైపుతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తన వీపుపై తీవ్ర గాయాలవ్వడంతో, అదేరోజు కేజీహెచ్లో తగిలిన గాయాలకు ఎమ్మెల్సీ చేయించుకుని, నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో దొడ్డి కిరణ్ దాడికి పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. గతంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడి నుంచి రూ.4 లక్షలు తీసుకుని కిరణ్ తిరిగి ఇవ్వలేదని సురేష్ మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేసి చంపుతానంటూ దొడ్డి కిరణ్ బెదిరిస్తున్నారన్నారు. ‘ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించాలి’ అంటూ సురేష్ సీపీకి విన్నవించారు.
వేటు వేసినట్లే వేసి వెంట తిప్పుకొంటూ...
భూకబ్జాల వివాదంలో ఉన్న దొడ్డి కిరణ్ గతంలో చెరువు భూముల ఆక్రమణ విషయంలో సర్వే చేయడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపై దాడి చేశారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో దొడ్డి కిరణ్ ఏకంగా సాయిరెడ్డికి శిలా విగ్రహం ఏర్పాటు చేసి స్వామి భక్తి చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైవీ బాధ్యతలు తీసుకున్నాక, 89వ వార్డు వైకాపా అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్పై ఆ పార్టీ గతేడాది మే 13న సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్యాలయం తెలిపింది. వేటు పడినా దొడ్డి కిరణ్ వైకాపా నేతల వెంటే ఉంటున్నారు. బడా నేతల పేర్లు చెప్పుకొంటూ అక్రమాలకు పాల్పడుతున్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి