logo

మండుటెండలో చిన్నారులతో ఎన్నికల ప్రచారం

విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండుటెండలో చిన్నారులతో ఎన్నికల ప్రచారం చేయించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Published : 03 Apr 2024 03:38 IST

దక్షిణ వైకాపా అభ్యర్థి వాసుపల్లి తీరుపై తీవ్ర విమర్శలు

చిన్నారుల చేత పూలు చల్లించుకుంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్‌

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ మండుటెండలో చిన్నారులతో ఎన్నికల ప్రచారం చేయించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మంగళవారం పాతనగరం 39వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానికుల నుంచి స్పందన లేకపోవడంతో వైకాపా కార్యకర్తల్లో ఒకరు 9 మంది చిన్నారులను తీసుకొచ్చి వాసుపల్లిపై పూలు చల్లించారు. వారితో జేజేలు కొట్టించారు. అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనచోదకులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఒక హద్దు ఉంటుందని, చిన్నారుల చేత కూడా ప్రచారం చేయించుకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి వాసుపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని