ఎక్కడున్నారో.. ఏమయ్యారో.. విశాఖలో గాలిస్తున్న కోస్టుగార్డు నౌకలు, హెలికాప్టర్
విశాఖ చేపలరేవు నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు దిటవు చేసుకుని తమవారి కోసం తీరంలో ఎదురు చూస్తున్నారు.
తీవ్ర ఆందోళనలో బాధిత కుటుంబాలు
విశాఖ చేపలరేవు నుంచి వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు దిటవు చేసుకుని తమవారి కోసం తీరంలో ఎదురు చూస్తున్నారు.
న్యూస్టుడే, వన్టౌన్: పదవాల శ్రీనివాసరావుకు చెందిన ఫైబరు బోటు (ఐఎన్డీ-ఏపీ-వీ1-ఎంక్యూ-2736)లో కారి చిన్నారావు (45), కారి నరేంద్ర(18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చినసత్తెయ్య (55), వాసుపల్లి పొడుగు అప్పన్న(32) సోమవారం మధ్యాహ్నం వేటకు బయలుదేరారు. బోటు గంగవరం వైపు వెళ్లి అక్కడి నుంచి డీప్సీలో వేట ప్రారంభించింది. సోమవారం రాత్రి 10గంటల తర్వాత బోటులోని మత్స్యకారులు ఫోన్లో మాట్లాడారు. తదుపరి ఫోన్లు పనిచేయలేదు. మంగళవారం ఉదయానికి బోటు చేపలరేవుకు చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు రాలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మత్స్యశాఖ ఇన్ఛార్జి జేడీ విజయకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కోస్టుగార్డు, నౌకాదళ అధికారులకు సమచారం అందించారు. ఈ మేరకు కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు, నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ గల్లంతైన బోటు కోసం గాలిస్తున్నాయని మత్స్యశాఖ జేడీ విజయృష్ణ తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.
అధికారులు పట్టించుకోరా?: మరోవైపు ఉదయం నుంచి బోటు గల్లంతైన విషయం చెబుతున్నా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోలేదని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకరు గల్లంతైనా హడావుడి చేసేవారని, ఇప్పుడు ఆరుగురు గల్లంతైనా సకాలంలో స్పందించకపోవడం దారుణమన్నారు. గల్లంతైన వారిలో కారి చిన్నారావు, కారి నరేంద్ర తండ్రీ కొడుకులు. మిగిలిన వారు సైతం సమీప బంధువులే. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, ముక్కం గ్రామానికి చెందిన వీరు పొట్టకూటి కోసం విశాఖ వచ్చి చేపలవేట సాగిస్తూ జీవనం పొందుతున్నారు. చేపలరేవు సమీపంలోని జాలారిపేటలో నివాసం ఉంటున్నారు.
- విశాఖ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మంగళవారం సాయంత్రం చేపలరేవుకు చేరుకున్నారు. మత్స్యశాఖ అధికారులు, బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. నౌకాదళ అధికారులతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేస్తామని, ఘటనకు సంబంధించిన అంశాలను కలెక్టర్, ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట