దందాల ‘బాణం’...ఉక్కిరిబిక్కిరిలో జనం!!
ఆ కార్పొరేటర్ చూపు ‘బాణం’ కంటే వేగమైంది. ఇంకేముంది జీవీఎంసీలో తనకు దక్కిన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమాల పర్వానికి తెరలేపారు. ఉత్తరం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ... ఎలా వీలైతే అలా కాసుల వేట సాగించారు.
‘ఉత్తరం’లో వైకాపా నేత అక్రమాలు
కీలక పదవి అడ్డుపెట్టుకుని కమీషన్ల వసూళ్లు
షాదీఖానా
ఆ కార్పొరేటర్ చూపు ‘బాణం’ కంటే వేగమైంది. ఇంకేముంది జీవీఎంసీలో తనకు దక్కిన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమాల పర్వానికి తెరలేపారు. ఉత్తరం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ... ఎలా వీలైతే అలా కాసుల వేట సాగించారు. అధికారం అండతో జీవీఎంసీలో వ్యవస్థలన్నింటినీ దాసోహం చేసుకుని జేబులు నింపేసుకుంటున్న సదరు నేత తీరుతో ఎంతో మంది అడిగినంత సమర్పించుకోక తప్పడం లేదు.
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్టుడే, కార్పొరేషన్, అక్కయ్యపాలెం
బకాయిలు తగ్గించేసి..
వాణిజ్య సముదాయాలు, మార్కెట్ల బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం, అవినీతిని గుర్తించిన నాటి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన రెవెన్యూ అధికారులతో సమీక్షించి నోటీసులు జారీ చేశారు. మొత్తం 905 దుకాణాలు, మార్కెట్లకు సంబంధించి రూ.50 కోట్లకుపైగా ఆదాయం రావాలని నిర్ధారించారు. బకాయిలపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం వసూళ్లకు సిద్ధమయ్యారు. ఇంకేముంది? ఓ ‘బాణం’ ఇక్కడ సంధించారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రత్యేకంగా ఐదుగురితో కమిటీని నియమించగా.. అందులో ఉన్న ఈ నేత చక్రం తిప్పారు. పాతనగరంలోని ఫ్రూట మార్కెట, జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట నుంచి రావాల్సిన రూ. కోట్ల బకాయిలను రూ. లక్షల్లోకి తెచ్చి కొందరి నుంచి కమీషన్ల రూపంలో భారీగా లబ్ధిపొందారనే విమర్శలు వెల్లువెత్తాయి.
భారీగా అద్దె వసూళ్లు: అక్కయ్యపాలెంలోని జీవీఎంసీ షాదీఖానాను మూడేళ్ల లీజుకు ఒక అనుచరునికి కట్టబెట్టారు. శుభకార్యాలకు రూ.60వేలు అద్దె.. మరో రూ.40వేలు విద్యుద్దీపాలంకరణ, షామియానాకు అంటూ రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి భవనానికి సంబంధించిన అద్దె మాత్రమే గుత్తేదారులు వసూలు చేయాలి. మిగతా అలంకరణ, ఆహార పదార్థాల తయారీ వంటివి అద్దెకు తీసుకున్నవారి ఇష్ట ప్రకారం బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం గుత్తేదారు చెప్పినవారి వద్దే తీసుకోవాలంట. వేలం వేయక ముందు జీవీఎంసీ ఆధీనంలో ఉన్నప్పుడు రూ.8 వేలు ఉండే అద్దె.. ఆ తరువాత భారీగా పెరిగిపోయింది.
కోళ్ల వ్యర్థాల్లోనూ...: కోళ్ల వ్యర్థాల్లోనూ కాసుల వేట సాగిస్తున్నారు. నగరంలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించడానికి జీవీఎంసీ కొన్ని వ్యాన్లను ఏర్పాటు చేసింది. వ్యర్థాలను అక్కయ్యపాలెం 80 అడుగులరోడ్డు కె.వి.పాఠశాల వద్ద వేరు చేసి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుకు ఆహారంగా పంపిస్తున్నారు. ఇలా కోళ్ల వ్యర్థాలతో చేపలు పెంచడం, వ్యర్థాలు రవాణా చేయడం రెండూ చట్ట విరుద్ధమే. అయినా ఈ కోళ్ల వ్యర్థాల రవాణాతో రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. జీవీఎంసీలో కీలక ప్రజాప్రతినిధి మేనల్లుడితోకలిసి భాగస్వామ్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
సిబ్బంది నియామకాల్లో చక్రం తిప్పి: నగరంలో చెత్త తరలించే గుత్తను రాష్ట్రస్థాయిలో అప్పగించారు. అయితే.. అదనపు వాహనాల్లో చెత్తను తరలించాలనే ప్రతిపాదన మళ్లీ స్థాయీ సంఘంలో ప్రతిపాదించడంలో కీలకంగా వ్యవహరించిన ఈ నేత కమీషన్లు పొందుతున్నారు. జీవీఎంసీˆలో కొత్తగా కూలి ప్రాతిపదికన కార్మికులను ఏర్పాటు చేయిస్తున్నట్లు ప్రతి స్థాయీ సమావేశంలో అనుమతులు పొందుతున్నారు. ఇప్పటికి 600 మంది పారిశుద్ధ్య కార్మికులను పేరుకు నియమించి... పనిచేయకుండానే ఆ సొమ్ములు తన జేబులోకి వచ్చేలా చేసుకున్నారన్న విమర్శలున్నాయి.
నిర్మాణదారులకు దడే: నగరంలో కొన్ని అనధికార నిర్మాణాలకు ఆయన కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో దర్జాగా ఓ నిర్మాణం చేపట్టగా..అధికారులు చర్యలు తీసుకోకుండా కథ నడిపారనే ఆరోపణలున్నాయి. నందగిరినగర్లోని నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా జి+3 భవనాన్ని నిర్మిస్తున్నారు. పోర్టు ఆసుపత్రి ఎదురుగా జాతీయ రహదారి ఆనుకుని జరుగుతున్న ఓ భవన నిర్మాణానికి పూర్తిస్థాయి అనుమతుల్లేకపోయినా రూ. లక్షలు వసూలు చేసి అధికారులెవ్వరూ అటువెపు వెళ్లకుండా కట్టడిచేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ పెద్దల్లో కొందరికి ఇవ్వాలంటూ నగరంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి కూడా భారీగానే గుంజేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..