logo

గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. విశాఖ జిల్లా శివారు అప్పికొండ ప్రాంతంలో వారు ఉన్నట్లు బుధవారం తెల్లవారుజామున అధికారులు గుర్తించారు.

Published : 03 Apr 2024 10:50 IST

విశాఖపట్నం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. విశాఖ జిల్లా శివారు అప్పికొండ ప్రాంతంలో వారు ఉన్నట్లు బుధవారం తెల్లవారుజామున అధికారులు గుర్తించారు. ఆరుగురు మత్స్యకారులూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అలల ఉద్ధృతికి వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడి దెబ్బంది. దీంతో దాని పైభాగంలో ఉంటూ బిక్కుబిక్కుమని రాత్రంతా గడిపారు. మత్స్యకారులు క్షేమంగా ఉండటంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

మరోవైపు ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్‌పై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతైనట్లు సమాచారం ఇచ్చినా సకాలంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఫిషింగ్‌ హార్బర్‌ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేపై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని