logo

తెదేపాలో 200 మంది వైకాపా కార్యకర్తల చేరిక

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వర్గీయులైన సుమారు 200 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.

Published : 13 Apr 2024 03:50 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వర్గీయులైన సుమారు 200 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. శుక్రవారం పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈనెల 9న సీతంరాజు సుధాకర్‌, కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్‌రావు, ఉరికిటి నారాయణరావు తదితరులు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన వర్గీయులంతా తెదేపా కండువాలు కప్పుకొన్నారు. గండిబాబ్జీ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్‌ చేరికతో దక్షిణంలో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఇదే ఊపుతో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ విజయానికి కృషి చేయాలని కోరారు. సీతంరాజు సుధాకర్‌ మాట్లాడుతూ వైకాపా మోసకారి పార్టీ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కారణంగానే తాము తెదేపాలో చేరామని, కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్లు ఉరికిటి నారాయణరావు, విల్లూరి భాస్కర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని