‘చెత్త’పాలనలో ఇంతే!!
ఊహించని స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వం అలా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. వైకాపా ప్రభుత్వం మాత్రం భిన్నంగా పాలించింది. జనమెవరూఊహించని రీతిలో ‘చెత్త’ సేకరణ పన్ను విధించింది.
ప్రతి ఇంటిపై బాదుడే
ఎవరినీ వదలని వైకాపా ప్రభుత్వం
ఈనాడు-విశాఖపట్నం, న్యూస్టుడే, కార్పొరేషన్
ఊహించని స్థాయిలో అభివృద్ధి జరగాలని, ప్రభుత్వం అలా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. వైకాపా ప్రభుత్వం మాత్రం భిన్నంగా పాలించింది. జనమెవరూ ఊహించని రీతిలో ‘చెత్త’ సేకరణ పన్ను విధించింది.
వైకాపా పాలనలో ‘బాదుడు’ ఎలా ఉంటుందో ‘చెత్త సేకరణ పన్ను’ రూపంలో చూపించింది. కట్టని వారికి ఓ దశలో సచివాలయ ఉద్యోగుల ద్వారా హెచ్చరికలు కూడా రావడం గమనార్హం. ఆ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేసిన జగన్ పాలనపై మండిపడుతున్న జనం... రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారు.
వేధింపులూ తప్పలేదు..
2021 జూన్ నుంచి చెత్త ఛార్జీల వసూలుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో విడుదల చేసింది. నగరంలో మురికి వాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60, మిగతా ప్రాంతాల నుంచి రూ.120 వసూలు చేయాలని నిర్ణయించింది. ఇలా విశాఖ నగరంలో గృహాల యజమానులపై ఏటా రూ.105 కోట్ల భారం మోపింది. ఈ పన్నుపై వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. కొందరు ఇంటి యజమానుల పింఛన్ల సొమ్ములోంచి కూడా పన్ను కట్టించారు. కట్టని వారి ఇళ్లు, దుకాణాల ముందు చెత్తను వేసి వేధింపులకు గురి చేసిన ఘటనలూ లేకపోలేదు.
మురికి వాడల్లోనూ అధికమే..
సాధారణంగా మురికివాడల్లోని నివాసితులు ఏడాదికి రూ.300 వరకు గతంలో పన్ను రూపంలో చెల్లించేవారు. ప్రస్తుతం వీరు నెలకు రూ.60 చొప్పున ఏడాదికి చెత్త ఛార్జీలే రూ.720 చెల్లిస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 6,73,632 గృహాల నుంచి నెలకు రూ.60 చొప్పున రూ.4,04,17,920, మిగతా 3,97,006 గృహాల నుంచి రూ.120 చొప్పున రూ.4,76,40,720... ఇలా మొత్తం రూ.8,80,58,640 జీవీఎంసీ వసూలు చేస్తోంది.
రూ. 165 కోట్ల ‘చెత్త సేకరణ’ పన్ను భారంపై జనాగ్రహం
తీర్మానం తుస్..
ఆస్తి పన్నులో చెత్త ఛార్జీల కోసం ప్రత్యేక కేటాయింపు లున్నా..ఈ విధంగా మళ్లీ వసూలు చేయడాన్ని నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తెల్ల రేషన్కార్డులున్నవారి నుంచి నెలకు రూ.20 నుంచి రూ.30 వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఆయా ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టింది. దీంతో జీవీఎంసీలో వైకాపా కార్పొరేటర్ల పాలక వర్గం చేసిన తీర్మానం తుస్మంది. దీంతో నగరవాసుల నుంచి యథాతథంగా ముక్కుపిండి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.
వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, ఇతర నిర్మాణాల నుంచి వస్తున్న ‘చెత్త పన్ను’ దాదాపు రూ.60 కోట్లు వరకు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల