logo

14న ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు మూడు సభలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

Published : 13 Apr 2024 04:06 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అధినేతకు ఘనంగా స్వాగతం పలికి సభలను విజయవంతం చేసే పనిలో తెదేపా శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఈనెల 14న చంద్రబాబు పాయకరావుపేట, చోడవరం, గాజువాక ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. 15న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని రాజాం, పలాస, టెక్కలిలో జరిగే సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. చంద్రబాబు బసకు ఉపయోగించే ప్రత్యేక వాహనం విశాఖ రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని