సొంతింటి కల.. మిగిలింది కలత
తెదేపా హయాంలో ఎన్టీఆర్ రూరల్, పీఎంఏవై -ఎన్టీఆర్ గ్రామీణ, అర్భన్ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు...
ఇళ్ల నిర్మాణానికి రూపాయి సాయం ఇవ్వని ప్రభుత్వం
పేదోడి గూడు అంటే జగనన్నకు చిన్నచూపే
తెదేపా హయాంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, బృందం
నాడు..: తెదేపా హయాంలో ఎన్టీఆర్ రూరల్, పీఎంఏవై -ఎన్టీఆర్ గ్రామీణ, అర్భన్ పేర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1.15 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. గ్రామీణ్ పథకంలో లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 52 వేల రాయితీతో కలిపి రూ. 2 లక్షలు యూనిట్ విలువగా ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పీవీటీజీలకు మరో రూ.లక్ష, షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనులకు రూ.75 వేలు, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 50 వేల చొప్పున యూనిట్ విలువకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. అదేవిధంగా ఎన్టీఆర్ అర్భన్ బీఎల్సీ పథకంలో రూ.లక్ష రాయితీ ఇచ్చి బ్యాంకులోన్ కలిపి రూ. 2.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేవారు. అప్పటి ధరలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయానికి పెద్దగా తేడా ఉండేది కాదు. ఎంతో కొంత అదనంగా వేసి మంచి ఇంటిని నిర్మించుకునేవారు.
నేడు..: వైకాపా సర్కారు కొలువు తీరిన రెండున్నరేళ్ల వరకు ఇళ్ల నిర్మాణం వైపే చూడలేదు. తర్వాత పేదలందరికీ ఇళ్ల పథకం పేరుతో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 72 వేల ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయంగా రూ. 1.8 లక్షలు ఇస్తున్నారు. ఈ మొత్తంలో కేంద్రం ప్రభుత్వం రూ. 1.5 లక్షలు ఇస్తే మిగతా రూ. 30 వేలు ఉపాధిహామీ పథకం ద్వారా చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. పైగా నిర్మాణ సామగ్రి పేరుతో ఇనుప ద్వారబంధాలు, కిటికీ ఫ్రేమ్లు, రంగులు, వైరింగ్ సామగ్రి అంటగలిపి ఇచ్చే అరకొర సొమ్ములో కొంత కోతపెడుతున్నారు. జగనన్న కాలనీల్లో ఇంటి కోసం ఇస్తున్న రూ. 1.8 లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పిడుగు..
ఇసుక నుంచి సిమెంటు, పిక్క, ఇనుము వరకు అన్నింటా పెరుగుతున్న ధరలు చూసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రభుత్వం రూ. 1.8 లక్షలు ఇస్తున్నా ఇప్పుడున్న ధరల ప్రకారం సెంటున్నరలో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇసుక ఉచితమంటూనే రవాణాభారం నెత్తిన వేస్తున్నారు. అదనంగా సిమెంటు సరఫరా చేస్తామని చెప్పినా అమలు చేయడం లేదు. సిమెంట్ బస్తా నేడు రూ. 420 పలుకుతోంది. ఇనుము సక్రమంగా సరఫరా చేయడం లేదు.. భవన నిర్మాణ కార్మికుల కూలి రేట్లు పెరగడంతో ఇంటి బడ్జెట్ ఊహించనంత పెరిగిపోతోంది. దీంతో కొంతమంది పునాదులు, లింటల్ స్థాయి వరకు నిర్మించి వదిలేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం