పాలన ఘోరం... ఫలితాలు దారుణం!!
విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి జిల్లాలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థపై లేకపోయింది.
ప్రభుత్వ కళాశాలలపై దృష్టిసారించని వైకాపా ప్రభుత్వం
‘ఇంటర్’లో ఉత్తీర్ణతా తీరే రుజువు
న్యూస్టుడే, మద్దిలపాలెం
‘నా’..అంటూ పేదల గురించి గొప్పగా చెప్పే ముఖ్యమంత్రి జగన్... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే పేద పిల్లలపై దృష్టిసారించలేదు. ఆ ఫలితమే... శుక్రవారం బయటపడింది.
విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి జిల్లాలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థపై లేకపోయింది. విడుదలైన ఇంటర్ ఫలితాలు చూస్తే ప్రభుత్వ కళాశాలల్లో వసతులు, బోధన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ సీఎం జగన్ గత అయిదేళ్లుగా ఊదరగొడుతున్నారు. కానీ, కళాశాలల్లో సదుపాయాల మెరుగుపరచడంపై దృష్టి పెట్టలేదు. ఆనందపురం కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 19 మంది పరీక్షలు రాస్తే ఇద్దరే పాసయ్యారు. అయిదేళ్లుగా జిల్లాలోని కళాశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది.
కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే..: సాధారణ కోర్సులకు సంబంధించి జిల్లాలో 197 మంది అధ్యాపకులున్నారు. వారిలో శాశ్వత అధ్యాపకులు 71 మంది మాత్రమే. కాంట్రాక్టు అధ్యాపకులు 70, అతిథి అధ్యాపకులు 56 మంది ఉన్నారు. శాశ్వత అధ్యాపకులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా హయాంలో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులకు సమయానికి జీతాలు ఇచ్చిన దాఖలాల్లేవు. ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. అతిథి అధ్యాపకులకు మరోచోట మెరుగైన అవకాశం వస్తే వెళ్లిపోతున్నారు. ఈ ప్రభావం బోధనపై పడింది. కొన్ని కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ జరిగినా.. నియామకాలు చేపట్టలేదు.దీంతో సరైన బోధన సాగలేదు.
పుస్తకాలేవి: తెదేపా హయాంలో ఇంటర్ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పుస్తకాల పంపిణీ జరిగేది. వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. మూడేళ్లుగా విద్యార్థులకు పుస్తకాల సరఫరా నిలిచిపోయింది. దీంతో చదువు పూర్తయి వెళ్లిపోయే విద్యార్థుల నుంచి పుస్తకాలు తీసుకొని కొంత మందికి సర్దుతున్నారు.
ఏటా ఇంటర్ ప్రవేశాలు జూన్ నుంచి సెప్టెంబరు చివరి వరకు జరుగుతున్నాయి. డిసెంబరు చివరి నాటికి సిలబస్ పూర్తికావాల్సి ఉన్నా.. అలా జరగలేదు. నాడు-నేడు పనులు వేసవి సెలవుల్లో పూర్తిచేయాలి. కానీ జూన్ నుంచి ఇప్పటివరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటివల్ల విద్యార్థుల బోధనకు ఆటంకం కలుగుతోంది.
‘హైస్కూల్ ప్లస్’లో అధ్వానం: ‘హైస్కూల్ ప్లస్’లో ఫలితాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలోని ఆరు పాఠశాలల్లో ‘హైస్కూల్ ప్లస్’ను ప్రవేశపెట్టారు. నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత పాఠశాలలకు అనుబంధంగా ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. గదులు కేటాయించడం తప్ప అక్కడ ఇంటర్ విద్యకు అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. కొన్నిచోట్ల పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులతో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పించారు. జూనియర్ అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు. ఇంటర్ తొలి ఏడాదిలో మొత్తం 167 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 25 మంది (20.3 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గంగవరం పాఠశాలలో 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన ఏ పాఠశాలలోనూ ఉత్తీర్ణత 20 శాతం కూడా దాటలేదు. రాంపురం పాఠశాల నుంచి 20 మంది పరీక్షలు రాస్తే ఒక్కరే పాసయ్యారు. 111 మంది ద్వితీయ ఇంటర్ పరీక్షలు రాయగా 22 మంది (21.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సీతమ్మధార పాఠశాల (35.7) మినహా ఏ పాఠశాలలోనూ ఉత్తీర్ణత 30 శాతం దాటలేదు.
ఎందుకీ పరిస్థితంటే...
- తగినంత మంది బోధకుల నియామకం జరగకపోవడం
- పుస్తకాల సరఫరా లేకపోవడం
- ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలందకపోవడం
- ప్రజాప్రతినిధులు, యంత్రాంగం దృష్టిసారించకపోవడం
- సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి